Wednesday, September 27, 2023

కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి బ్రేక్ వేసిన సర్వోన్నత న్యాయస్థానం

• శంకుస్థాపనకు అనుమతినిచ్చిన సుప్రీం కోర్టు
• తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ నిర్మాణానికి బ్రేక్

రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సెంట్రల్ విస్టాపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పెండింగ్ లో పలు వ్యాజ్యాలు ఉన్నాయని వీటిపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి నిర్మాణాలు లేదా కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేసింది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్ లను జస్టిస్ ఎఎం ఖాన్ విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రాజెక్టు నిర్మాణం పట్ల మోడీ ప్రభుత్వ వైఖరిని ధర్మాసనం తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తదుపరి తీర్పు వెలువడే వరకు ప్రాజెక్టులో ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టబోమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇచ్చిన నేపథ్యంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ శంకుస్థాపనకు న్యాయస్థానం అనుమతినిచ్చింది.

Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles