Sunday, April 28, 2024

చంద్రబాబు నాయుడిపై మరో కేసు

  • బాబుపై లిక్కర్ స్కామ్ కేసు బుక్ చేసిన  సి ఐ డి
  • పురందేశ్వరి ఆరోపణల పై బుక్ ఐన కేస్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కేసులో చిక్కు కున్నారు. లిక్కర్ కంపెనీలకు 2015 నుంచి 2019 మధ్య కాలంలో జారీ చేసిన లైసెన్సులలో అవకతవకలు జరిగినట్లు సి ఐ డి కేసు నమోదు చేసింది. ఈ కేసుకి సంబందించి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు గత రెండు నెలలుగా లిక్కర్ లైసెన్సులపై అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వస్తున్నారు. ఆసక్తికరంగా ఈరోజు సి ఐ డి కేసు నమోదు చేసింది.

చంద్రబాబు హయాంలో జారీ చేసిన మద్యం కంపెనీల నుంచే తాము మద్యం కొంటున్నామని వైస్సార్ ప్రభుత్వం కొత్తగా లైసెన్స్ జారీ చేసింది లేదని చెబుతూ వస్తోంది.

 ఈరోజు సి ఐ డి ఏసీబీ కోర్టు లో తదుపరి విచారణ నిమిత్తం అనుమతి కోరుతూ పిటిషన్ వేసింది. కోర్టు సి ఐ డి కి తదుపరి విచారణ కు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిషి సిసోడియా మద్యం కేసులో గత ఎనిమిది నెలలుగా జైలు ఉన్న విషయం విదితమే.

C.S. Kulasekhar Reddy
C.S. Kulasekhar Reddy
కులశేఖర రెడ్డి 1992 నుంచి ఆంధ్రభూమి లో పనిచేశారు. వ్యవసాయం, నీటి పారుదల, విధ్యుత్ రంగాలపై పలు వ్యాసాలు రాసారు. అనంతపురం, చిత్తూరు, విజయవాడ, కడప, కర్నూల్, హైదరాబాద్ లలో 27 సంవత్సరాలు విలేఖరిగా పని చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles