Friday, April 26, 2024

ప్రతి గడపను తడుతూ, ప్రతి ఒక్కరిని కలుస్తూ..

* సాగర్ లో జోరుమీదున్న గులాబీ పార్టీ ప్రచారం

* నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం – ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

ఏప్రిల్ 17 న జరిగే నాగార్జున సాగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిచి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని అనుముల మండల ఇంఛార్జ్ సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం నుండే ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతి గడపను తడుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్  అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Also Read : సంపూర్ణ రాజకీయ నేత నోముల నరసింహులు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ మేము ప్రచారానికి వెళ్లినప్పుడు ఓటర్లు తమ కంటే ఉత్సాహంగా తామంతా టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని చెప్పడం గర్వంగా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్  పట్ల ప్రజల్లో ఎంతో విశ్వాసం ఉందని తెలుస్తోందని, ఈ రాష్ట్రానికి కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రజలకు గట్టి నమ్మకం ఉందని తెలిపారు.

ప్రతి ఇంటికి  ముఖ్యమంత్రి  ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల రూపంలో మేలు పొందిన లబ్ది దారులు ఉన్నారని వారంతా కేసీఆర్ గారు వెన్నంటే ఉంటారని, రాబోయె ఎన్నికల్లో నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గులాబీ జెండా ఎగురవేసి కెసిఆర్  నాయకత్వాన్ని బలపరుస్తామని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles