Saturday, April 27, 2024

ఏడేడు జన్మల నిన్ను ఎడబాయనీవయ్య

29 తిరుప్పావై

మాడభూషి శ్రీధర్

13.1.2024

శిత్తమ్శిఱుకాలే వంద్ ఉన్నై శేవిత్తు ఉన్
పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్
పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ
కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు
ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!
ఎత్తెక్కుం ఏరేర్ పిఱవిక్కుం ఉన్ తన్నోడ్
ఉత్తోమేయావోంఉనక్కే నాం ఆట్చెయ్ వోం
మత్తై నం కామంగళ్ మాత్త్-ఏలోర్ ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

తామరవోలె మృదువుగా గుబాళించు నీ పసిడి పాదాల

వ్రాల,తెలతెలవారుఝామునే నీ కోవెలకు జేరినాము

పశువుల మేపు వారలకు పఱైలు పఱములేలనయ్య

మా గొల్లలకు నీ తోడినేస్తమే సమస్త సిరిసంపదలయ్య

మా కులాన జనించిన నీవు మాసేవలు కాదనరాదు

ఏడేడు జన్మల నిన్నెడబాయని సాపత్యమీయవయ్య

ఇతర వాంఛలెల్ల తుడిచివేసి నిన్నుమాత్రమే ధ్యావించి

నిన్నె సేవించి పూజించు బుద్ధి వరముగా నీయవయ్య

శిత్తమ్శిఱుకాలే = తెల్లవారుఝాముకన్నాముందువచ్చే బ్రాహ్మీ ముహూర్తంల, 

వంద్ = వచ్చి, ఉన్నైశేవిత్తు ఉన్ = నిన్ను సేవించి, ఉన్పొన్ తామరై అడి= నీ అందమైన పాదకమలాలకు, పొట్రుమ్పొరుళ్ = మంగళాశాసనం చేయడానికి గల ప్రయోజనాన్నికేళాయ్ = వినాలి,పెత్తం మేయ్ త్తు = పశువులనుమేపి,ఉణ్ణుం=జీవించే,కులత్తిల్ పిఱందు, నీకులంలో పుట్టిన,నీకుత్తేవల్= యాదవకులంలో,

ఎంగలై=మాచే,క్కోళ్ళామల్పోగాదు=స్వీకరించకుండాఉండడం తగదు,

ఇత్తై=ఈ రోజు,పఱైకోళ్వాన్ అన్ఱు కాణ్= నీవుకరుణించి ప్రసాదిస్తున్న పఱైని తీసుకొనడానికి వచ్చిన వారిమి కాము= గోవిందా! = ఓ గోవిందా,

ఎత్తెక్కుం = ఈకాలమున్నంతవరకు,ఏరేర్పిఱవిక్కుం=ఏడేడుజన్మలకు,

ఉన్తన్నోడ్= నీతోనే, ఉత్తోమేయావోం = సంబంధంకలిగిన వారై ఉంటాము,

ఉనక్కే= నీకు మాత్రమే,నాం=మేము,ఆట్చెయ్ వోం= దాస్యంచేయాలని కోరుకుంటున్నాము,మత్తై నం=మాయొక్క కామంగళ్= తదితర కోరికలు,

మాత్త్= పోగొట్టాలి,ఏలోర్ఎంబావాయ్= అదే మావ్రతము.

మూడుకాలాలు: ప్రాతఃవేళలు మూడు – కాలై, చిరుకాలై, శిత్తం శిరుకాలైతామసులులేచే వేళ కాలై, గోపస్త్రీలుచేరుకునిచల్ల చిలికే వేళ చిరుకాలై, దానికన్నముందుగా గోపబాలికలు లేచిన వేళ శిత్తంశిరుకాలే. శ్రీకృష్ణుడివియోగ దుఃఖం అనే చీకటి పోగొట్టడానికి ఉదయించే సూర్యబింబంపోలిన ముఖం కలిగినశ్రీకృష్ణుడిని చూడడానికి పోతున్నందున ఇదే ఉదయమైపోయింది.

‘‘ఆవిర్భూతమ్ మహాత్మానా’’అంటే భగవంతుడు ఆవిర్భవించిన అర్ధరాత్రి కూడా ఉదయకాలమే అవుతుంది.

‘‘మీపాదాలే మాకు ధనం. మాకే ఇతర ప్రయోజనాలూ లేవు. నీ పాదసేవే మా పరమలక్ష్యం.పశువులనుమేపుకుని తినే మా కులంలో ఎందుకు పుట్టావు? దీనులైనమమ్మల్ని ఉద్ధరించడానికే కదా? కైంకర్యచేయకుండా మేముండలేము. మా సేవలను స్వీకరించకుండా నీవూ ఉండలేవు. మా సేవలువద్దనుకుంటే మరి నీవెందుకు జన్మించావు. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో అది పొందాలికదా. మాలో ఒకరిని పొందడానికి నీవు వచ్చావు. పశువులను రక్షించడానికి వేరెందరోఉన్నారు’’ అన్నారు గోపికలు.

‘‘నేనుస్వీకరించదలచిన అంతరంగ కైంకర్యాలను నాకు కావలసినపుడు నేను స్వీకరిస్తాను. మీరువ్రతం చేసిందే పఱై కోసం కదా అదిస్తాను తీసుకువెళ్లండి’’ అని శ్రీ కృష్ణుడుఅన్నాడు.

‘‘పఱైకావాలని అన్నాం.కానిఅది నిజంగా ఉళ్లో వాళ్ల కోసం చెప్పిన నెపంమాత్రమే. మాకు నీవు తప్ప మరేదీ అవసరం లేదు’’ అన్నారు.

‘‘మరిపఱై అంటే ఏమిటని మీ ఉద్దేశం. ఆ పేరుతో మీరు అడుగుతున్నదేమిటి’’ అని శ్రీ కృష్ణుడుఅడిగాడు.

‘‘నీవుఎన్ని అవతారాలెత్తినా నిన్ను సేవించి కైంకర్యంచేసే భాగ్యం మాకు కావాలి. నీవుదేవుడివైతే దేవతగానూ మానవుడివైతే మానవిగానూ జనించే శ్రీదేవి వలె మేమూ కైంకర్యంచేయాలని కోరుకుంటున్నాం’’

నీవు ఎక్కడ పుడితే అక్కడ మేముండాలి. నీకు తల్లిగా, భర్తగా తండ్రిగా,తమ్ముడిగాబంధువులుగా మేమే ఉండాలి మాకు అన్ని బంధుత్వాలు నీవే కావాలి.

సీత భరతుడు నిన్నుకొన్నాళ్లు విడిపోయారు. కాని లక్ష్మణుడి వలె నిన్ను ఎప్పుడూ ఎడబాయకుండా ఉండేభాగ్యం మాకుండాలి. మా ఆనందం కోసం కాదు. మన ఇద్దరి ఆనందం కోసం కూడా కాదు. కేవలం నీముఖం ఆనందంతో వికసించడం కోసం నీకే దాస్యం చేస్తామని అంటున్నాం’’ అని గోపికలుఅంటున్నారు.

‘‘ఇదికాకుండామాలో పొడిచూపగల ఇతర కామభావనలన్నీ నీవే పోగొట్టాలి. భోగంలో ఇద్దరూ కలిసి మెలిసిఉండడంలోఇద్దరికీ ఆనందం సమానంగా ఉంటుంది. కాని భోక్తవైన నీవు మాసేవలతోఆనందించడాన్ని చూసి మేము సంతోషించాలి’’.

“ఇత్తైపఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!” మేం ఏదో ఒకటి అడగాలని అది అడిగాం, మేం కోరేవి ఇవికాదు. కేవలం మాట పట్టుకొని చూస్తావా, మా మనస్సులో ఏం ఉందో తెలియదా అని అడిగారు. నాకేంతెలియదు, నేనుమీ గొల్లల్లో ఒకడినే కదా అని అన్నాడు శ్రీకృష్ణుడు.

“ఎత్తెక్కుం” ఎల్లప్పటికీ, ఈ కాలం ఆ కాలం అని కాదు, సర్వ దేశముల యందు, సర్వఅవస్థల యందు, “ఏరేర్పిఱవిక్కుం” ఏడేడు జన్మలలో కూడా ‘‘ఉన్ తన్నోడుత్తోమేయావోమ్’’ నీతో సంబంధమేకావాలి.

కాలాధీనం కాని పరమపదం లో ఉన్నామాకు నీ సంబంధమే ఉండాలి “ఉనక్కే నాంఅట్చెయ్ వోం మత్తై నం కామంగళ్ మాత్త్” కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమైఉండాలి. తెలియక ఏదైన లోపం ఉంటే నీవే సరి దిద్దాలి, మాపైభారం వెయ్యవద్దు. నీవే కావాలని నీతో సంబంధబాంధవ్యమే కావాలని గోదాదేవినిర్ద్వంద్వంగా చెప్పడంతో అందరికీ వ్రతఫలితం దక్కింది. శ్రీకృష్ణ సమాగమంలభించింది.

ఈ రోజు పురుషార్థం పొందిన రోజు. ఈ రోజు స్వామి గోదాదేవిని రప్పించుకొనిమానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహరూపంలోనే శ్రీకృష్ణుడు వివాహమాడిన రోజు.

గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనక ఈ రోజు”భోగి” అనిశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ వివరించారు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles