Friday, September 29, 2023

జీహెచ్ఎంసీ పోల్ : ఇంకు గుర్తు చెల్లదు : హైకోర్టు ఆదేశం

  • ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల కొట్టివేత
  • స్వస్తిక్ గుర్తు మాత్రమే చెల్లుతుందని కోర్టు ఉత్తర్వు

హైదరాబాద్ : స్వస్తిక్ గుర్తుతో పాటు ఇంక్ గుర్తును కూడా ఓటుగా పరిగణించాలంటూ తెలంగాణ ఎన్నికల కమిషన్ గురువారం అర్ధరాత్రి (తెల్లవారితే శుక్రవారం అనగా) జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ బీజేపీ నాయకులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం ఉదయం పరిగణనలోకి తీసుకొని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను కొట్టివేసింది. స్వస్తిక్ గుర్తులను మాత్రమే ఓట్లుగా పరిగణించాలనే హైకోర్టు నిర్ణయాన్ని అన్ని కౌంటింగ్ కేంద్రాలకూ వెంటనే తెలియజేయాలంటూ ఎన్నికల కమిషన్ ను కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదే వేస్తూ వివరంగా కౌంటర్ ను దాఖలు చేయవలసిందిగా ఎన్నికల కమిషన్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామాన్ని అధికార టీఆర్ఎస్ కు నష్టదాయకమైనదిగా పరిశీలకులు భావిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles