Friday, April 26, 2024

అన్వేషి

                                                                                                                                వెతుక్కుంటున్నా

మా మనుషులెక్కడన్నా కనపడతారేమోనని

యాక్సిడెంటయి చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడే వాణ్ని

విడియోలు తీసేవాళ్ళు కనిపిస్తున్నారు.

రోడ్డు మీద, సినిమా హల్లో, కాలేజిలో స్త్రీలను వేధించే వాళ్ళను

చూస్తూనే పట్టించుకోకుండా వెళ్ళే వాళ్ళు కనిపిస్తున్నారు.

కళ్ళముందు పట్టపగలు నడిబజారులో హత్య జరిగినా

సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని పారిపోయేవాళ్ళు కనిపిస్తున్నారు.

కళ్ళెదురుగా కల్తీ చేస్తున్న వాణ్ని

పట్టించుకోకుండా తిరిగేవాళ్ళు కనిపిస్తున్నారు.

తూకంలో మోసాన్ని గమనించికూడా

అడగడం నామోషీగా భావించే వాళ్ళు కనిపిస్తున్నారు.

లంచం అడిగిన వాణ్ని సంతోషంగా చూస్తూ

ఎవరు తినడంలేదో చెప్పమనేవాళ్ళు కనిపిస్తున్నారు.

ఎవరైనా ఇలాంటి వాళ్ళను నిలదీస్తే

ఛాందసుడని చప్పరించేస్తున్నారు.

వీళ్ళందరూ కనిపిస్తున్నారు కాని

నాకు మనుషులెవ్వరూ కనిపించడం లేదు.

మీకు కనిపిస్తే నాకు కాస్త చెప్పరూ.

Also read: కుపిత

Also read: మేలుకో ఓటరూ!

Also read: అంత్య ఘడియలు

Also read: భూతలస్వర్గం కశ్మీర్

Also read: భావదాస్యం

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles