Friday, April 26, 2024

రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్ సర్జరీ

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఈ విషయాన్ని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విటర్ లో తెలిపారు. శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యుల బృందాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రపతి కోవింద్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎయిమ్స్ డైరెక్టర్‌ను అడిగి తెలుసుకున్నానని తెలిపారు. రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో ఈ నెల 26న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు సాధారణ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఇతర పరీక్షల కోసం ఎయిమ్స్ లో చేరారు. ప్లాన్‌డ్ బైపాస్ ప్రొసీజర్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో కోవింద్‌ను మార్చి 27 మధ్యాహ్నం ఎయిమ్స్ కు తరలించారు.

Also Read: విమానాశ్రయాల్లో మాస్క్ ధరించకుంటే ఇంటికే

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles