Sunday, April 28, 2024

స్వభావం  ప్రధానం

భగవద్గీత – 71

ఒకడు ఒక చిత్రాన్ని అద్భుతంగా గీస్తాడు. ఇంకొకడు రాయిలో అద్భుత సౌందర్యాన్ని దర్శించి మన కళ్ళెదుట సాక్షాత్కరింపచేస్తాడు. మరియొకడు గాలిలో తేలిపోయే దూదిపింజలను దారాలుచేసి ఆ దారాలతో అతి నాజూకైన వస్త్రాన్ని నేస్తాడు. మనము ఈ రోజున ఎన్ని వస్తువులు వాడుతున్నాం… కారు, మోటరు సైకిలు, స్మార్టు ఫోను, వంటింట్లో వాడే సామగ్రి…

ఒకటేమిటి? సమస్త వస్తువులు ఎవరో ఒకరి ఆలోచనలనుండి ఉద్భవించినవే కదా! ఆ వస్తువు కనుక్కున్న ఆ మనిషికే ఆ ఆలోచన వచ్చినదేమిటి? మిగిలినవారికి రాలేదెందుకు?

Also read: పని నేర్చుకున్న తర్వాతనే పర్యవేక్షణ

ఉదాహరణకు ఒక బ్యాంకులో కొందరు పనిచేస్తుంటారు. ఒకరికి డిపాజిట్ల సేకరణ వెన్నతోపెట్టిన విద్య. మరొకరికి ఋణ మంజూరు చేయడమంటే చాలా ఇష్టం. ఖాతాదారులు తీసుకున్న అప్పులను వసూలు చేయడంలో ఒకడు నిష్ణాతుడు. వీరందరికీ ఎవరికి ఏ పని ఇవ్వాలి, ఎవరికి ఏది ఇస్తే పని అద్భుతంగా పూర్తి అవుతుంది అని manage చేయడంలో ఒకడు expert.

ఒక అందమైన పువ్వును చూసి మనసుకు హత్తుకొనే కవిత్వం ఒకడు చెపితే… ఆ పువ్వు నుండి సుగంధ తైలము ఎట్లా తీయాలా అని ఒకడి బుర్ర ఆలోచిస్తుంది.

ప్రకృతి ఒకటే.

సృష్టి ఒకటే.

మనుషుల బాహ్య ఆకృతీ ఒకటే.

Also read: ఎవరి మనస్సు శాంతితో నిండి ఉంటుంది?

కానీ ఆయామనుషుల మేధస్సులలో, ఆలోచించే తీరులో ఎంత వైవిధ్యం ఉన్నదో గమనించండి. ఈ వైవిధ్యాన్నే పరమాత్మ స్వభావము అని అన్నారు…

పై విషయాలను చూస్తే మనకు ఒకటి అర్ధమవుతుంది. ఒకటే ప్రపంచం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనపడ్డది. ఎందువలన? వారివారి స్వభావమువలన.

అందుకే ఆయన ఇలా చెప్పారు

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః

న కర్మ ఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ! (5-14)

భగవంతుడు ఫలానా గ్రూపుకు ఇది, ఫలానా గ్రూపుకు ఇది అని విభజన చేయలేదు ( సామాజికవర్గం). ఎవరికీ ఏ అధికారమూ ఈయలేదు. ఏ కర్మఫలాన్ని ప్రత్యేకించలేదు. సమస్తముకూడా స్వభావము చేతనే ప్రవర్తించుచున్నది.

స్వామి ఎంత చక్కగా చెప్పారో చూడండి…!

గీతను అర్ధం చేసుకుని మసలితే కులాల కుంపట్లు ఆరిపోతాయి. తల్లిదండ్రులు పిల్లలను నువ్వుఫలానా చదువే చదవాలనే వత్తిడిపెట్టరు. ఆఫీసులలో ఎవడు ఏ పనిలో నిష్ణాతుడో ఆ పనిలోనే వినియోగించుకుంటారు. అంతేకానీ కోతిని ఈదమని, చేపను చెట్టెక్కమని చెప్పరు.

మన మనస్సు లోతులను స్పృశిస్తూ మనకు సత్యమేదో నిత్యమేదో తెలియచేస్తుంది గీత.

Also read: కనులుమూసినా నీ రూపే

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles