Friday, April 26, 2024

మల్లేపల్లి లక్ష్మయ్యకు శాంతి పురస్కారం

ఆలిండియా బజ్మే రహ్మతే ఆలం సంస్థ ఏటా అందించే శాంతి పురస్కారాన్ని ఈ సంవత్సరం ప్రముఖ పాత్రికేయుడూ, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వ్యవస్థాపక అధ్యక్షుడూ, బుద్దవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, అంబేడ్కర్ మేధావి అయిన మల్లేపల్లి లక్ష్మయ్యకు ప్రదానం చేశారు. మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకొని హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించిన వేడుకలో ఆలిండియా బజ్మే రహ్మతే ఆలం సంస్థ అధ్యక్షుడు ఎంఏ ముజీబ్ ఈ పురస్కారాన్ని అందజేశారు. మతసామరస్యాన్నీ,  సమాజసేవనూ ప్రోత్సహించే ప్రముఖులకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో మతగురువులు మౌలానా సయ్యద్ సాదత్ పీర్ బాగ్దాది, సయ్యద్ మతీన్ అలీషా ఖాద్రీ, తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్తపైన లక్ష్మయ్య రాసిన వ్యాసం, ఆయన ప్రాపంచిక దృక్పథం, తదితర అంశాలను పరిగణలోనికి తీసుకొని ఈ అవార్డు ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles