Saturday, April 27, 2024

అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన రత్నం నాసిన్  శిక్షణా కేంద్రం

  • ముచ్చటగా మూడు పుట్టపర్తి, నాసిన్, కియా
  • కరవు సీమలో రత్నాలు
  • జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
  • హాజరైన గవర్నర్, వై ఎస్ జగన్

అంతర్జాతీయ స్థాయికి మరోసారి అనంతపురం జిల్లా చరిత్ర పుటల్లోకి  ఎక్కింది. ఆధ్యాత్మిక కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో పుట్టపర్తి కి సమీపంలో  గోరంట్ల మండలం పాలసముద్రం  వద్ద   503 ఎకరాల్లో దాదాపు 700 కోట్లతో నిర్మించిన నాసిన్ శిక్షణ కేంద్రం  మంగళవారం పీఎం నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు ఏపీ గవర్నర్ హా జరైయ్యారు. అంతర్జాతీయ  కస్టమ్ సంస్థ  నాసిన్ గుర్తించింది.  నాసిన్ శిక్షణ కేంద్రంలో ప్రధానంగా ఇండియన్ రెవెన్వు సర్వీస్ కు ఎంపిక ఐన ఐఆర్ఎస్  కేడర్ కు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ లో  కష్టమ్స్, ఇండైరెక్ టాక్స్, నార్ కోటిక్  వంటి  అంశాలపై    శిక్షణ ఇస్తారు. ఐఏఎస్ లకు ముస్సోరి, ఐపీ ఎస్ హైద్రాబాద్ లో శిక్షణ ఎలా ఇస్తారో  నాసిన్ లో ఐఆర్ఎస్ లకు శిక్షణ ఇస్తారు. కేంద్రం  ఎంపిక చేసిన ఇతర రంగాల్లో వారికీ సైతం  ఇక్కడ శిక్షణ ఇవ్వడాకి అవకాశాలు  వున్నాయి. నాసిన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు తో చుట్టుపక్కల  గ్రామాల నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలు  దొరుకుతాయి. జాతీయ రహదారి 44 కు సమీపంలో నాసిన్ కేంద్రం వుంది. పెనుకొండ వద్ద ఉన్న కియా కార్ల ఉత్పత్తి కేంద్రం నాసిన్ కు 20 కిలోమీటర్లు దూరంలో వుంది.

C.S. Kulasekhar Reddy
C.S. Kulasekhar Reddy
కులశేఖర రెడ్డి 1992 నుంచి ఆంధ్రభూమి లో పనిచేశారు. వ్యవసాయం, నీటి పారుదల, విధ్యుత్ రంగాలపై పలు వ్యాసాలు రాసారు. అనంతపురం, చిత్తూరు, విజయవాడ, కడప, కర్నూల్, హైదరాబాద్ లలో 27 సంవత్సరాలు విలేఖరిగా పని చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles