Friday, April 26, 2024

రాజమహేంద్రవరంలో ఉజ్జయిని తరహా మహా కాళేశ్వరాలయం

త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

వోలేటి దివాకర్

పవిత్ర గోదావరీ తీరాన రాజమహేంద్రవరంలో మధ్యప్రదేశ్ లోని ప్రఖ్యాత ఉజ్జయిని తరహా మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఉజ్జయిని లో ఉన్న మహాకాళేశ్వర ఆలయంలో ఏ విధంగా అయితే పూజ కార్యక్రమాలు జరుగుతయో అదే మాదిరిగా ఈ ఆలయంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. 75 అడుగుల నాలుగు దిక్కుల రాజ గోపురాలు నిర్మాణం, 50 అడుగుల నాలుగు మహా మండపాలు, నలు వైపులా నాలుగు ధ్వజ స్తంభాలు,  నాలుగు మహా నందులు,109 అడుగుల గర్భాలయ గోపురం. ఆలయం చుట్టూ ప్రాకారం నందు 64 ఉప ఆలయాలు  నిర్మించారు.

పాతికేళ్ల క్రితమే రాజమహేంద్రవరం లోని కైలాస భూమి శ్మశాన వాటికలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన పట్టపగలు వెంకట్రావు, తోట సుబ్బారావు ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేతుల మీదగా ఈ ఆలయం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. ఇప్పటికే ఆలయ విశిష్టత గురించి సీఎంతో  ఆలయ నిర్వాహకులు చర్చించారు.  మరోసారి ఆలయ ట్రస్టు సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని ఆహ్వానించనున్నారు.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles