Friday, April 26, 2024

సింగరేణిలో ఉద్యోగాల జాతర

  • మార్చిలోగా సింగరేణిలో 651 ఖాళీల భర్తీకి నిర్ణయం
  • సింగరేణిలో 651 పోస్టుల భర్తీ -సీఎండీ శ్రీధర్ వెల్లడి
  • 569 కార్మికులు, 82 అధికారుల పోస్టులకు విడుదల కానున్న నోటిఫికేషన్
  • తెలంగాణ ఏర్పడ్డాక 13,934 మందికి ఉపాధి కల్పించిన సింగరేణి

ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న 651 ఖాళీలను మార్చిలోగా భర్తీ చేస్తామని సింగరేణి సిఎండి. ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం (జనవరి 8)  హైదరాబాద్‌ లో ప్రకటించారు. నియామక ప్రక్రియ మొత్తం మార్చి 2021 నాటికి పూర్తి చేస్తామని, అన్ని పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. 651 ఖాళీలలో 569 ఎన్‌సిడబ్ల్యుఎ పరిధిలోని కార్మిక ఉద్యోగాలు, 82 అధికారుల స్థాయి పోస్టులు ఉన్నాయని, ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా వీటిని భర్తీ చేస్తామని తెలిపారు.

ఇది చదవండి: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ

569 కార్మిక పోస్టుల ఖాళీ వివరాలు

సింగరేణి సంస్థ వివిధ విభాగాలలో 569 కార్మిక పోస్టులను గుర్తించింది. వీటిలో జూనియర్‌ అసిస్టెంటు క్లర్కులు 177 పోస్టులు, ఫిట్టర్లు 128 పోస్టులు, ట్రైనీ ఎలక్ట్రిషీయన్లు 51 పోస్టులు, ట్రైనీ వెల్డర్లు 54 పోస్టలు, టర్నర్‌/ ట్రైనీ మెషినిస్టులు -22 పోస్టులు, ట్రైనీ మోటర్‌ మెకానిక్‌లు 14 పోస్టులు, ట్రైనీ మౌల్డర్ లు 19 పోస్టులుగా గుర్తించారు. ఆసుపత్రులలో వివిధ స్థాయిలలో ఖాళీలను గుర్తించారు. జూనియర్‌ స్టాఫ్‌ నర్స్‌ 84 పోస్టులు, ల్యాబ్‌ టెక్నిషీయన్లు 7 పోస్టులు, ఫార్మసిస్టులు 5 పోస్టులు, ఎక్స్‌-రే, ఇసిజి వెంటిలేటర్‌ విభాగాల్లో రెండేసి పోస్టులు, ఫిజియోథెరపీ, వెంటిలేటర్‌ విభాగంలో ఒక్కొక్క పోస్టును భర్తీ చేయనున్నారు.

82 అధికారుల స్థాయి పోస్టుల ఖాళీలు

 వివిధ శాఖల్లో అధికారుల స్థాయిలో ఉన్న 82 ఖాళీలను సంస్థ గుర్తించింది. మైనింగ్‌ విభాగంలో మేనేజిమెంటు ట్రైనీలు 39 పోస్టులు, పర్సనల్‌ ఆఫీసర్‌ 17 పోస్టుల, మేనేజిమెంటు ట్రైనీలు (ఇండస్ట్రీయల్‌ ఇంజనీరింగ్‌) 10 పోస్టులు, సివిల్‌ శాఖలో మేనేజిమెంటు ట్రైనీలు 7 పోస్టులు, మేనేజిమెంటు ట్రైనీలు (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) 6 పోస్టులు, జూనియర్‌ అటవీ అధికారి 3 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.   

ఇది చదవండి: సింగరేణి అధికారులకు పిఆర్‌పి చెల్లింపుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్        

1,436 ఇంటర్నల్ పోస్టుల భర్తీ :

సింగరేణిలో కారుణ్య నియామకాల ప్రక్రియ, డిపెండెంట్‌ ఉద్యోగాలలో భాగంగా సుమారు 10 వేల మందికి పైగా యువకులు సింగరేణిలో ఉద్యోగ వసతి  పొందారు. వీరిలో వందలాది మంది ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్నారు. అయినప్పటికీ బదిలీ వర్కర్లు లేదా జనరల్‌ మజ్దూర్లుగా కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల శాసనసభలో మాట్లాడుతూ,  సింగరేణిలో ఖాళీ పోస్టుల భర్తీలో సంస్థలో పనిచేస్తున్న అర్హులైన అభ్యర్ధులకు కూడా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు వివిధ గనులు, విభాగాలు, కార్యాలయాలలో ఖాళీగా ఉన్న 1,436 పోస్టులను ఇంటర్నల్‌ అభ్యర్ధులతో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సిఎండి శ్రీ ఎన్‌.శ్రీధర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఇంటర్నల్‌ సర్క్యూలర్ల ద్వారా దరఖాస్తులను ఆహ్వానించి, నియామకాలు చేపడతమాని తెలిపారు.

ఇది చదవండి: కొత్తగూడెంలో జరిగిన 99వ సింగరేణి వార్షిక జనరల్‌ బాడీ మీటింగ్‌

ఇంటర్నల్ అభ్యర్థులకు గల ఖాళీలు

ఇంటర్నల్‌ రిక్రూట్‌ మెంట్‌ లో భాగంగా ఇ.పి. ఆపరేటర్‌ ట్రైనీలు 210 పోస్టులు, ఇ.పి. ఆపరేటర్‌ ఫిట్టర్‌ ట్రైనీలు 178 పోస్టులు, క్లర్కులు (జూనియర్‌ అసిస్టెంట్స్‌) 177 పోస్టులు, వార్డు అసిస్టెంట్లు 175 పోస్టుల, ఆయా పోస్టులు 94, డ్రైవర్లు 64 పోస్టులు, ట్రైనీ వెల్డర్లు 55 పోస్టులు, అసిస్టెంట్‌ ఫోర్‌ మెన్‌ (మెకానికల్‌) ట్రైనీలు 56 పోస్టులు , ఎలక్ట్రీషీయన్‌ ట్రైనీలు 51 పోస్టులు, ఇ.పి. ఎలక్ట్రీషీయన్‌ ట్రైనీలు 42 పోస్టులు, పిట్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ (పి.ఓ.ఎ.) 36 పోస్టులు, జూనియర్‌ అకౌంటెంట్లు 24 పోస్టులు, టర్నర్‌ మెషినిస్టు ట్రైనీలు 22 పోస్టులు, మౌల్డర్ ట్రైనీలు 19 పోస్టులు, మోటార్‌ మెకానిక్‌ ట్రైనీలు 14పోస్టులు, స్టోర్‌ కీపర్స్‌ 13 పోస్టులు, జూనియర్‌ ఫారెస్ట్‌ అసిస్టెంట్స్‌ 8 పోస్టులు, ల్యాబ్‌ టెక్నిషీయన్లు 7 పోస్టులు, లా అసిస్టెంట్స్‌ 5 పోస్టులు, ఫార్మాసిస్ట్‌ 5 పోస్టులతో పాటు, ఎక్స్ రే, ఇ.సి.జి., వెంటిలేటర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రెండేసి ఖాళీలు, డైటిషీయన్‌, ఫిజియోథెరపిస్టు, డయాలసిస్‌ టెక్నిషీయన్లకు ఒక్కొక్క పోస్టు చొప్పున ఉన్న ఖాళీలను ఇంటర్నల్‌ అభ్యర్ధుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించారు.

తెలంగాణా ఏర్పడ్డాక 13,934 ఉద్యోగాలు భర్తీచేసిన సింగరేణి

సింగరేణి సంస్థ 2014 నుండి ఇప్పటి వరకు 13,934 ఉద్యోగాలను భర్తీచేసి రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వ సంస్థగా నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కారుణ్య ఉద్యోగల నియామకల ప్రక్రియ కింద ఇప్పటివరకూ 10,879 ఉద్యోగాలు కల్పించగా, 45 ఎక్స్ టర్నల్‌ రిక్రూట్‌ మెంటు నోటిఫికేషన్లు జారీ చేసి 3,055 మంది యువతకు ఉపాధి కల్పించింది. కాగా తాజాగా సంస్థ మరో 651 పోస్టులను డైరెక్టు రిక్రూట్‌ మెంట్‌ ద్వారా మార్చి 2021 నాటికి భర్తీ చేయనుంది. ఇంటర్నల్‌ నోటిఫికేషన్ల ద్వారా 2,501 ఉద్యోగాల కల్పించింది. అలాగే తాజా ఇంటర్నల్‌ రిక్రూట్‌ మెంట్‌ ద్వారా మరో 1,436 పోస్టులను మార్చికల్లా భర్తీ చేయనుంది. ఇవికూడా పూర్తయితే, మార్చి 2021 నాటికి సింగరేణి సంస్థ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్తగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య 18,522 చేరనుంది. దీనిపై సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులు సర్వత్రా హర్షం వ్యక్తంచేస్తున్నారు.  

ప్రతిభ ఆధారంగానే ఉద్యోగ నియామకాలు :

సంస్థ చేపట్టనున్న ఉద్యోగ నియామకాలు అభ్యర్ధుల ప్రతిభ, రాత పరీక్ష ప్రాతిపదికపైనే ఆధారపడి ఉంటాయని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. ఉద్యోగ నియామకాలలో పైరవీలకు ఆస్కారం లేదని తెలిపారు.  ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా చేప్తే వారి మాటలు నమ్మవద్దని యాజమాన్యం హెచ్చరించింది.

ఇది చదవండి: ఎమ్మెల్సీకవితతో సింగరేణి ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతల భేటి

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles