Friday, May 3, 2024

24, 25 తేదీల్లో భారీ వర్షాలు

అమరావతి: ఆగ్నేయ బంగాళా ఖాతం లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళా ఖాతం లో శనివారం అల్ప పీడనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటల్లో నైరుతి బంగాళా ఖాతం లో వాయు గుండం గా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశ వైపు కదులుతూ దక్షిణ తమిళనాడు తీరం వైపుగా ప్రయాణించి ఈ నెల 25 న తమిళనాడు–పుదుచ్ఛేరి తీర ప్రాంతానికి చేరనుందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావం తో ఈ నెల 24, 25 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయల సీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి గరిష్టంగా 75 కి.మీ. వేగం తో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఆయా తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్ల రాదని హెచ్చరించారు.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles