Saturday, April 27, 2024

తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు:కేసీఆర్

భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26 న జరుపుకునే, ” రాజ్యాంగ దినోత్సవం” సందర్భంగా.. తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు.

మహనీయుడు, భారత రత్న డా.బి.ఆర్ అంబేడ్కర్  రూపొందించిన భారత  రాజ్యాంగం.. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత వివక్షకు అతీతంగా, దేశ పౌరులందరినీ సమానంగా పరిగణిస్తుందనీ సీఎం అన్నారు.

ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో భారత రాజ్యాంగానిది ప్రథమ స్థానం అని సీఎం ఆన్నారు. మనుషులందరూ సమానమనే విశ్వమానవ సమానత్వ సిద్దాంతాన్ని భారత రాజ్యాంగం ప్రతిఫలిస్తుందని సీఎం తెలిపారు.

సమాఖ్య స్పూర్తిని బలోపేతం చేసే దిశగా, రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ అందించిన ఆర్టికల్ 3 ను అనుసరించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్ర  ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితోనే  పాలన కొనసాగిస్తున్నదని సీఎం అన్నారు.

అంబేడ్కర్ మహాశయుని పేరును తెలంగాణ సచివాలయానికి నామకరణం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళి అర్పించిందన్నారు.

 దేశంలోనే ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుతున్నామన్నారు.

 తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా వర్గాలు, పేదల సాధికారత, ఆత్మగౌరవం కోసం పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం  విజయవంతంగా అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలవడం లో రాజ్యాంగ స్ఫూర్తి ఇమిడి వున్నదని సీఎం అన్నారు.

పలు ప్రాంతాలు, భాషలు, మతాలు,సంస్కృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం ఫరిడవిల్లే భారత దేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకిక వాద, సమాఖ్య వాద స్ఫూర్తిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసిఆర్ పునరుద్ఘాటించారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles