Friday, April 26, 2024

ఓట్ల పండగ

ప్రజాస్వామ్యం అంటే ప్రజల రాజ్యం

తమ నాయకుడిని తామే నియమించుకునే అధికారం

తమ భవిష్యత్తు తామే నిర్ణయించుకునే అవకాశం.

ఎన్నికలు వస్తాయి

నాయకులు వస్తారు

అదీ ఇదీ  ఇస్తారు

నిన్ను ఒకరోజు సంతోష పెట్టి

వాళ్ళు ఐదేళ్ళు సంతోషంగా  దండుకుంటారు

వీధుల్లో తొడ కొట్టే రౌడీలు

నోరెత్తితే తంతాననే గూండాలు

నీకు దండం పెడుతూ వస్తారు

అన్నీ ఇస్తా, ఇంటికే పంపిస్తా అంటారు

కులం మతం పార్టీ అంటారు

మనోడినే అంటారు

నమ్మి మురిసి పోకు

మంచోడికి

నలుగురికీ మంచి చేసే వాడికి

జై కొట్టి నీ ఓటు వెయ్.

Also read: గుడి – బడి

Also read: ప్రియురాలికి ప్రేమలేఖ

Also read: మేతావులు

Also read: ఆత్మ బలం

Also read: మహర్షి

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles