Monday, April 29, 2024

అన్ని ఇసుక రీచ్ లను ఒకే సంస్థకు

  • కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్
  • భూముల రీసర్వే ప్రాజెక్ట్ కు ఆమోదం
  • మచిలీపట్టణం పోర్ట్ డీపీఆర్ ఆమోదం

అమరావతి: గురువారంనాడు ఇక్కడ జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. అయితే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అన్ని రీచ్‌లను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు ఆమోదం తెలిపారు. అంతేకాకుండా చిరు వ్యాపారులకు ఇచ్చే జగనన్న చేదోడు పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపారు. దీంతో పాటుగా 6 మెడికల్‌ కాలేజీలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు, పాడేరు మెడికల్‌ కాలేజీకి 35 ఎకరాలు కేటాయించారు. మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపారు. ఈ నెల 24 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎస్ఈబీ పరిధిని విస్తరించాలని కేబినెట్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఎస్‌ఈబీ పరిధిలోకి ఆన్‌లైన్ గ్యాబ్లింగ్ సహా వివిధ జూదాలు, డ్రగ్స్, గంజాయిని నిరోధించే బాధ్యతలు ఎస్‌ఈబీకి అప్పగించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles