Friday, April 26, 2024

ఆత్మహత్యకు అనుమతించవలసిందిగా కేటీఆర్ కు ఒక యువరైతు లేఖ

నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి యడవల్లి గ్రామానికి చెందిన చొప్పారి శ్రీను తెలంగాణ మునిసిపల్ వ్యవహారాల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రార్థించారు. ఆ లేఖను ట్విట్టర్ ద్వారా జనవరి 19న కేటీఆర్ కూ, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె. పాటిల్ కూ పంపించాడు. ఇంతవరకూ తనకు కెటీఆర్ నుంచి కానీ కలెక్టర్ నుంచి కానీ అధికారపార్టీ నాయకుల నుంచి గానీ ప్రభుత్వాధికారుల నుంచి కానీ ఎటువంటి స్పందనా అందలేదని శ్రీను విలేఖరులతో అన్నాడు.

శ్రీను రాసిన లేఖ

ఇంజనీరింగ్ పట్టభద్రుడైన శ్రీనుకు 25 సంవత్సరాలు. అతను వ్యవసాయం చేసుకుంటూ జీవితం వెళ్ళదీస్తున్నాడు. తన పొలం నుంచి తనను అధికారులు గెంటివేశారనీ, పల్లె ప్రకృతి వనం కోసం తన భూమి తీసుకుంటున్నారనీ శ్రీను ఫిర్యాదు చేశారు. భూమి ప్రభుత్వానిదనీ, శ్రీనుది కాదనీ శ్రీనుకు అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తమ పూర్వీకులు తమ భూములను 2010లో శ్రీశైలం ఎడమ కాలువ తవ్వుతున్న సమయంలో అమ్మివేసి సర్వేనంబర్ 354లో కొత్తగా కొనుక్కున్నారనీ, ఇది తమ భూమి కనుకనే రెవెన్యూ శాఖ తనకు 2016లో సమగ్రభూసర్వే జరిపిన తర్వాత పట్టా ఇచ్చిందనీ, డిజిటల్ పాస్ బుక్కు ఇచ్చిందనీ శ్రీను చెబుతున్నాడు. తన కొడుకును దున్నుకుంటున్న పొలం నుంచి అధికారులు గెంటి వేశారని శ్రీను తల్లి ఫిర్యాదు చేసింది.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles