Saturday, April 20, 2024

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్న కేంద్రం ప్రకటనపై మండిపడిన కేటీఆర్

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధానమంత్రి మోడీ లక్ష్యానికి అనుగుణంగా దేశంలోని ఎంతో మంది రైతుల ఆదాయం డబుల్ అయిందని కేంద్ర వ్యవసాయ శాఖ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ పెట్టింది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్, కేంద్ర ప్రభుత్వం చెపుతున్నది నిజమే అయితే అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను దేశ ప్రజల ముందు పెట్టాలని ప్రధానిని డిమాండ్ చేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక దేశ వ్యవసాయ రంగం అభివృద్ది, రైతుల సంక్షేమం కోసం ఏ పథకాలను అమలు చేశారో చెప్పాలన్నారు కేటీఆర్. ఇంతేకాదు ఎన్ని లక్షల మంది రైతుల ఆదాయం రెట్టింపు అయిందో ఆ వివరాలను బయటపెట్టాలని  కోరారు. ఇక ఏ రాష్ట్రానికి చెందిన రైతులకు లాభాల పంట పండి ఆదాయం డబుల్ అయిందో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.

రైతుగా ఓ మోడల్ గా నటించే నటుడు

మరోవైపు రైతుల ఆదాయానికి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ పెట్టిన పోస్టర్లో ఉన్న రైతు ఓ మోడల్ అని నెటిజన్లు తేల్చారు. నిజంగానే మోడీ ప్రభుత్వం అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తే ఆ విషయాన్ని ఒరిజనల్ రైతులతో చెప్పించాలి కాని ఇలా మోడల్స్ ను ఉపయోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం ఫేక్ న్యూస్ తో దేశ ప్రజలను మోసం చేస్తోందని నెటిజన్లు మండిపడ్డారు.

పార్లమెంటరీ పదాల నియంత్రణపై వ్యంగ్యాస్త్రాలు                                            

ఈ అంశంతో పాటు అన్ పార్లమెంటరీ పదాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రి కేటీఆర్ సెటైరికల్ గా స్పందించారు.

•తమ సమస్యలను పరిష్కరించాలని రోడ్లపైకి వచ్చిన దేశ ప్రజలను “ఆందోళన్ జీవి” అని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ అనొచ్చు. 

•“గోలీ మారో సాలోం కో” అని ఒక కేంద్ర మంత్రి రెండు వర్గాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టొచ్చు.

•అధికారంలో కోసం సమాజంలో చీలిక తెచ్చేలా 80-20 అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ఏం తప్పులేదు.

•జాతిపిత మహాత్మ గాంధీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా బీజేపీ ఎంపీ మాట్లాడితే ఏం ఫర్వాలేదు.

•దేశానికి అన్నం పెట్టే రైతులను “టెర్రరిస్టులు” అని పిలిస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఓకే.

ఇవన్నీ కూడా బిజెపి సారధ్యంలోని కేంద్రంలో పనిచేస్తున్న నాన్ పర్ఫామెన్స్  అస్సెట్ (NPA) గవర్నమెంట్ కు ఆమోదయోగ్యమైన పార్లమెంటరీ పదాలు అంటూ ఎద్దేవా చేశారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles