Monday, April 29, 2024

శాంతియుత హైదరాబాద్ కోసం తెరాసకే ఓటు: పోసాని కృష్ణమురళి

హైదరాబాద్ : జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాసకు ఓటు వేయాలని నటుడు పోసాని కృష్ణమురళి కోరారు. హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో దర్శకుడు ఎన్.శంకర్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు భాగ్యనగరంలో ఎక్కువగా మతకలహాలే ఉండేవని. కేసీఆర్ శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలతో శాంతియుత హైదరాబాద్​ని చూస్తున్నామని అభిప్రాయపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు అన్నివేళలా విద్యుత్, మంచినీరు, సాగునీటిని అందించారని పేర్కొన్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మత రాజకీయాలు చేస్తున్నాయని దర్శకుడు శంకర్ మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేయాలని కోరారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఆయన ప్రజలు తెరాసకు ఓటు వేయాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles