Saturday, April 27, 2024

ఉత్తమ్ రాజీనామా…కొత్త సారథి రేవంత్?

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ  ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ చేపట్టాలని కోరారు. కాగా, ఎంపీ  రేవంత్ రెడ్డి పీసీసీ కొత్త సారధిగా పగ్గాలు చేపడతారని, ఈ నెల 9వ తేదీన అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ వచ్చిన వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పటికే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

రేవంత్  ఆ పదవి అందుకుంటారని అప్పట్లోనే ప్రచారం జరిగినా రాజ్య సభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావు తదితరులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో  చూడాలి.

Also read: విరబూసిన కమలం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles