Friday, April 26, 2024

హింద్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా రియాజ్ అహ్మద్

హింద్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడుగా రియాజ్ అహ్మద్ ను ఎన్నుకున్నారు. హెచ్ఎంఎస్ కు అధ్యక్షునిగా ఉన్న మాజీ మంత్రి నాయిని నర్శింహారెడ్డి ఇటీవల మరణించడంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు రాష్ట్ర హెచ్ఎంఎస్ కార్యవర్గం సమావేశమయింది. ఈ సందర్భంగా సింగరేణికి చెందిన యూనియన్ నేత రియాజ్ అహ్మద్ ను రాష్ట్ర HMS అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. యూనియన్ హైదరాబాద్ లోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరిగింది. హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షులు గా రామకిషన్, కుమారస్వామి, రాజబాబు, అశోకరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రెబ్బ రామారావు, కార్యదర్సులుగా ఈశ్వరప్రసాద్, సారయ్య, రాజు, శ్రీనివాస్, యాదవ రెడ్డి, కోశాధికారిగా నర్సయ్య లను ఎంపికచేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles