Saturday, April 27, 2024

ఐపీఎల్ తో  సామాన్య జీవితాలు బుగ్గిపాలు, నిర్వీర్యం అవుతున్న  యువత

డా. ముచ్చుకోట సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక

ఇండియన్ ప్రీమియర్ లీగ్  అనేది భారతదేశంలోని ఒక ప్రొఫెషనల్ ట్వంటీ20 క్రికెట్ లీగ్.  దీన్ని 2008లో బిసిసిఐ  స్థాపించింది.  ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన, లాభదాయకమైన క్రికెట్ లీగ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది.  భారతదేశంలోని ఎనిమిది  నగరాలకు ప్రాతినిధ్యం వహించే ఎనిమిది జట్లు ఉన్నాయి. టోర్నమెంట్ ప్రతి సంవత్సరం మార్చి నుంచి మే వరకు జరుగుతుంది. ఐపీఎల్   ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేదిక అందించడం, భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రీడను ప్రోత్సహించడం.  లీగ్ తన ఆటగాళ్లను వేలం ద్వారా ఎంపిక చేస్తుంది.  దీనిని ఆటగాళ్ల విక్రయం అని పిలవాలి. ఆటగాళ్లు డబ్బు కోసం ఆడతారు,  జట్టు యజమానుల లక్ష్యం కూడా సంపాదనే. నల్లధనం కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఐపీఎల్‌కు చెందిన పలువురు యజమానులు, ఆటగాళ్లు అరెస్టయ్యారు.

గుర్రపు పందేలను మించి పిచ్చి  బెట్టింగ్

సంవత్సరంలో చాలా వేడిగా ఉండే ఏప్రిల్, మే నెలల్లో జరుగుతుంది. ముఖ్యంగా రాజస్థాన్‌లో మండుతున్న ఎండల వేడి కారణంగా క్రీడాకారులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.  కొంతమంది ఆటగాళ్లు, అధికారులు ఫిక్సింగ్ కుంభకోణానికి పాల్పడిన తప్పుడు కారణాల వల్ల ఐపిఎల్ కూడా చాలా దృష్టిని ఆకర్షించింది. అయితే, ఈ వివాదాలన్నీ లీగ్ వృద్ధికి దోహదపడ్డాయి,   నిరంతర విమర్శలు ఉన్నప్పటికీ, ఇది గరిష్ట సంఖ్యలో వీక్షకులను సంపాదించుకో కలిగింది.  భారతదేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్ అనేది గుర్రపు పందెం లాంటిది.   బెట్టింగ్  చాలా వరకు చట్టవిరుద్ధం. ఇతర అన్ని క్రీడలు బెట్టింగ్ అనేది వ్యక్తిగత రాష్ట్రాల చట్టాలపై ఆధారపడి ఉంటుంది. భారతదేశం క్రికెట్‌తో మరే ఇతర దేశంతో పోల్చలేని ప్రేమను కలిగి ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై బెట్టింగ్ అన్నింటినీ మించిపోయింది.   ఆశాజనకమైన చొరవ వివాదం, మనీలాండరింగ్, బంధుప్రీతి, అవినీతి,  ధనవంతులు  ప్రసిద్ధుల కోసం రాయితీలు  సబ్సిడీలలో చిక్కుకుంది.  ఐపీఎల్  చూసేందుకు మనిషి గంటల తరబడి వేచి ఉండడం, బెట్టింగ్ ద్వారా నల్లధనం చేకూరుతుండడం సమస్యగా మారుతుంది.  ఐపీఎల్ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట . చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ చర్చించుకుంటున్న ఆట క్రికెట్. క్రికెట్ పిచ్చి ఉన్న ఆటగాళ్లు, ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో టీవీలకే అతుక్కుపోతున్నారు. మరోవైపు పందెం రాయుళ్లు సందట్లో సడేమియా అనే చందంగా ఒకవైపు క్రికె ట్‌ను ఆస్వాదిస్త్ నే మరోవైపు తమదైన శైలిలో బెట్టింగ్ కాస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ బెట్టింగ్‌లో కోట్లాది  రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. గత పది పదిహేనేళ్ల క్రితం మొదలైన ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యసనం.. మొదట్లో కేవలం ఇండియా టీమ్ ఆడే మ్యాచ్ లకు మాత్రమే ఉండేది. రాను రాను ఇది మరింత ముదిరి పాకాన పడింది. ముఖ్యంగా టి-20 మ్యాచ్ లు ప్రారంభమైనప్పటి నుంచి బెట్టింగ్ జాఢ్యం ఊపందుకుంది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లు ఐపిఎల్ యువతను మరింత కట్టి పడేసింది.  ఒకే సీజన్ లో వరసగా సుమారు 90 కి పైగా మ్యాచ్ లు జరుగుతుండటంతో బెట్టింగ్ ల జోరుకు అడ్డుకట్ట అనేది లేకుండా పోయింది. ఈ సారి మార్చి నెలలో  ఐపిఎల్ ప్రారంభం కావడంతో బెట్టింగ్ రాయుళ్ల హవా మొదలైంది. బెట్టింగ్ లకు బానిసలుగా మారిన చాలా మంది అమాయకులు ఆర్థికంగా నష్టపోవడం కాకుండా,  తమ కుటుంబాలు చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా దేశంలో  క్రికెట్‌ బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి.

పల్లెలకూ పాకిన బెట్టింగ్ జాడ్యం

పలు జిల్లా కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమ దందా ఊపందుకుంది. ఐపీఎల్‌ బెట్టింగ్‌ ఇంతకు ముందు నగరాలకే పరిమితం కాగా ప్రస్తుతం పల్లెలకు కూడా పాకింది. బెట్టింగ్ లో ఎక్కువ శాతం యువత పాల్గొంటున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్‌ మనీతో క్రికెట్‌లో గెలుపోటములపై వారు పందాలు కాస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో యువతకు అధునాతన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉండడంతో గుట్టచప్పుడు కాకుండా యువత ఆన్‌లైన్‌ ద్వారా బెట్టింగులకు పాల్పడుతున్నారు. క్రికెట్‌ బుకీలను పరిచయం చేసుకుంటున్న యువత వారి ప్రోత్సాహంతో బెట్టింగులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. డబ్బు దొరకనప్పుడు  దొంగతనాలకు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.  సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా లల్లో  ఎక్కువగా  బెట్టింగ్, మాదకద్రవ్యాలకు, ఆర్థిక నేరగాళ్లు అధికం.  క్రికెట్ బెట్టింగ్‌ను నడిపించే ముంబయ్, డిల్లీ, హైదరాబాద్ సంబంధించి బుకీలతో పట్టణ ప్రాంతాలకు చెందిన కొందరు ప్రముఖులు సంబంధాలు పెట్టుకుని ఈ వ్యవహారాన్ని రహస్యంగా సాగిస్తున్నారు.  క్రికెట్‌ బెట్టింగ్‌లో భాగంగా పందేలు కాసేవారు బుకీల వద్ద కోడ్‌ భాష వినియోగిస్తూ అనుమానం రాకుండా కొనసాగిస్తున్నారు. బుకీల దగ్గర రిజిస్టర్‌ అయిన నెంబర్‌ నుంచి ఫోన్‌ రాగానే స్పందిస్తున్న యువత బెట్టింగుకు మొగ్గు చూపుతున్నారు. బెట్టింగ్‌ రాయుళ్లు వాడే భాషలో ‘లెగ్‌ ’అనే పదం కీలకమైంది. ఎన్ని లెగ్గులు తీసుకుంటే లెక్క ప్రకారం అంత మొత్తం చెల్లించాలనేది దాని అంతరార్థం. అలాగే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్టుపై పందెం కాసేందుకు ‘ప్లేయింగ్‌ ’ అని, తక్కువ అవకాశాలున్న జట్టుపై పందెం కాసేందుకు ‘ఈటింగ్‌ ’ అనే పదాలను ఉపయోగిస్తారని సమాచారం. మ్యాచ్‌ జరిగే రోజున అప్పటికప్పుడే ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు జరుపుతూ యువత బెట్టింగ్ లో పాల్గొంటున్నారు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయినా కొంతమంది మాత్రం బెట్టింగ్లనే వృత్తిగా సాగిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకోవాల. దేశంలో పందెం వేయడానికి ఇతర ప్రసిద్ధ క్రీడలు బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్  ఫుట్‌బాల్ వంటి అంతర్జాతీయ క్రీడలు. ఫలితం యొక్క అనిశ్చితి క్రీడ యొక్క ఆకర్షణలో ముఖ్యమైన భాగం. ఫలితం ముందుగా నిర్ణయించబడితే, క్రీడల సమగ్రత పోతుంది,  దానితో ఎక్కువ భాగం అర్థం అభిమానులను ఆకర్షిస్తుంది.  మ్యాచ్ ఫిక్సింగ్ అనేది క్రీడకు పెద్ద ముప్పుగా ఉంది.   ఆన్‌లైన్ జూదం యొక్క ఆగమనం ఆర్థిక లాభం కోసం మ్యాచ్ ఫిక్సింగ్ ప్రమాదాన్ని పెంచింది. ప్రపంచ జూదం పరిశ్రమ యొక్క భారీ స్థాయి వ్యవస్థీకృత నేరాలకు ఆకర్షణీయంగా ఉంది అలాగే  పందెం రకాల పరిధి పెరిగింది. లోపల తప్పుడు సమాచారం. అటువంటి జూదం  ఫిక్సింగ్ కారణంగా అవినీతి కూడా పెరిగింది,  ఇది వృత్తిపరమైన క్రీడ భవిష్యత్తుకు ప్రాథమిక ప్రపంచవ్యాప్త ముప్పు. స్పోర్ట్స్ బెట్టింగ్ చట్టం అనేది గందరగోళంగా  సంక్లిష్టమైన అంశం ఎందుకంటే ప్రతి దేశానికి స్పోర్ట్స్ బెట్టింగ్‌కు సంబంధించి దాని స్వంత చట్టాలు ఉన్నాయి. ఈ చట్టంలో ఎక్కువ భాగం ఖచ్చితంగా ఏది చట్టబద్ధమైనది,  ఏది కాదో స్పష్టం చేయడంలో విఫలమైంది. గుర్రపు పందాలపై బెట్టింగ్‌లు మినహా భారతదేశంలో క్రీడలు బెట్టింగ్‌లు ప్రధానంగా చట్టవిరుద్ధం. ఇతర క్రీడలు వ్యక్తిగత రాష్ట్రాల చట్టాలు లేదా భారతదేశం సాధారణ చట్టాల పై ఆధారపడి ఉంటాయి. భారతదేశంలో ఎక్కువ భాగం పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867,  టెక్నాలజీ యాక్ట్ 2000కి లోబడి ఉంది. ఆ చట్టాల ప్రకారం స్పోర్ట్స్ బెట్టింగ్ అనుమతించబడదు కానీ ఒక్కో రాష్ట్రానికి వారి స్వంత చట్టాలు రూపొందించుకునే హక్కు ఉంటుంది. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ (1867) ప్రకారం, భారతదేశంలో అన్ని రకాల జూదాలు చట్టవిరుద్ధం. కానీ యుఎస్లో కాకుండా అమెరికా ఇంటర్నెట్ గ్యాంబ్లింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, భారతీయ వ్యవస్థలో ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించే నిర్దిష్ట చట్టం ఏదీ లేదు. బెట్టింగ్ కంపెనీలు భారతీయులను ప్రతి దానిపై పందెం వేయడానికి ఈ లొసుగులను ఉపయోగించుకుంటున్నాయి. ఐపిఎల్  ద్వారా చదువు అట్ట కెక్కడం, విద్యార్థులు ఏకాగ్రతకు భంగం కలగడం, యువత పెడ ధోరణి అవలంబించడం,  తప్పుడు మార్గాలు ఎంచుకోవడం  గమనిస్తున్నాము.  కావున  యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసే ఐపీఎల్ ని  ప్రభుత్వం నిషేధించాలి.

Dr. M. Suresh Babu
Dr. M. Suresh Babu
Dr. M. Suresh Babu has been a Professor, Dean and Principal in various engineering colleges and institutions in Hyderabad and Anantapur. His approach to teaching is “For the student, by the student and to the student.” He is associated with several Civil Society Organizations like Praja Science Vedika and Election Watch.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles