Thursday, November 30, 2023

పరిమళం

మట్టి వాసనని

మల్లెల  వాసనని

ఇష్టపడని వారెవరు  ..?

అత్తర్లు

స్ప్రేలు సరే సరి

ఆ సువాసనలని

ఇష్టపడే  వాళ్ళు..

ఇష్టపడని వాళ్ళు ..

సహజసిద్ధ పరిమళాలని 

ఇష్టపడని వారెవరు..?

పువ్వులు తమ సువాసనలని

దాచుకోవు

వెదజల్లుతాయి.

మానవ పరిమళాలైన

ప్రేమ,జాలి

కరుణ, సహాయాలని

వెదజల్లి

తామున్న  ప్రదేశాన్ని

పరిమళభరితం చేసే

మనుషులెందరు ..?

Rajender Mangari
మంగారి రాజేందర్ జింబో కి కవిత్వం,కథలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు . అందరికీ న్యాయం అందాలన్నది అయన అభిమతం . జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి,పదవీ విరమణ చేసినప్పటికీ రచయితగా తన సామాజిక బాధ్యత నిరంతరం అని విశ్వసించే వ్యక్తి. (మా వేములవాడ కథలు, జింబో కథలతో కథా సాహిత్యం మీద ఆయన చెరగని ముద్ర వేసారు. హాజిర్ హై అంటూ నేర న్యాయ వ్యవస్థ పై మరే కవీ రాయలేని కవిత్వం రాశారు. లోపలివర్షం,రెండక్షరాలు కవిత్వం సెంటిమెంట్, మానవ సంబంధాలు ప్రతిబింబిస్తే ,"చూస్తుండగానే "లో ఆధునిక జీవితం లోని సంక్లిష్టతని కవిత్వీకరించారు.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles