Saturday, April 27, 2024

దేవుడివైనా సరే బాధ్యత కర్మ వదలకూడదు

శ్రీమాన్ కె ఇ నరసింహన్ ప్రవచనం

ఎంతటి జ్ఞానసంపన్నులైనా కర్మను వీడకూడదని, కనుక మార్గళిస్నానం వ్రతం వంటి పెద్దలు చెప్పిన శిష్టాచారాన్ని పాటించాలి. శంఖం కోరడమంటే ప్రణవధ్వని చేసే శంఖం ద్వారాప్రణవార్థమైన అకార త్రయ జ్ఞానాన్ని, పఱై అడిగి పరతంత్ర జ్ఞానాన్ని , పల్లాండు శైప్పారే అంటే సజ్జనసాంగత్యం, కోలవిళక్కే అంటే జ్ఞాన దీపమును, కొడియే వితానమే అంటే స్వభోక్తృత్వ దోషము లేని నీ కైంకర్యాన్ని అనుగ్రహించమని గోపికలు కోరుతున్నారు.

లెక్కప్రకారం మధ్యాహ్న సంధ్యావందనం లేదు. కాని పెద్దలు త్రిసంధ్యా వందనం ఉండాలని అంటారు. కనుక చేయాలి. అదే కర్మ. శ్రీకృష్ణుడు అల్లరి చిల్లరిగా తిరగకుండా పశువలను కాపాడుకోవడానికి వెళ్లాలని యశోద పంపించాడట. తన ఆవుమందలేకాక, పక్కమిత్రుల ఆవుమందలాను కూడా కాచుకున్నాడట. హయ్యా ఇదేం కర్మ అనుకున్నారట. అదే కర్మ. చేయవలసిన పని చేయాల్సిందే. మార్గళి వ్రతం కూడా అదే కర్మ. గోకులంలో పుట్టిన వాళ్లేనా అని ఆశ్చర్యపడే విధంగా అద్భుతమైన పనులు చేసిన వాడేనా ఈ శ్రీకృష్ణుడు అనుకున్నారు. వారంటే ఆశ్రిత వ్యామోహం వల్లనే ప్రార్థించినవి ఈ పరికరాలు. నాకెందుకీ పరికరాలు? ఆశ్రిత వ్యామోహం మరో ఉదాహరణ. సుగ్రీవుడు సువేల పర్వతం చుట్టూచూస్తూ ఉండగా రావణుడు కనిపించగానే కోపం వచ్చింది. గుర్తించాడు కూడా. ఎందుకంటే రావణుడి ఛాతిమీద ఐరావంతం దెబ్బ మచ్చలు కనిపించాయి. సీతను రావణాసురుడ ఎత్తుకుపోవడం వల్లనే కదా ఈ కష్టాలన్నీ అని కోపించి ఎగిరి వెళ్లి, తన్ని అతనితోయుద్ధానికి సిధ్దమయ్యాడు. చివరకు రావణుడు ఓడిపోయి మాయాయుద్ధానికి దిగగానే తెలుసుకుని, రివ్వున ఎరిగిపోయి రాముని ముందు నిలబడ్డాడు. ఇప్పుడు బాధపడ్డాడు రాముడు. సుగ్రీవుడా నీకేమయినా అయితే నేనేం చేయగలను. నా మిత్రుడు లేకుండా నేను గెలిచినా ఏం చేసేది. సీతను రక్షించుకుంటాను, రావణాసుర సంహారం  చేసి తీరతాడు. ఇచ్చిన మాట ప్రకారం విభీషణుడికి నీకు పట్లాభిషేకాలు చేసి వెళ్లిపోతాను. కాని నాకెందుకీ రామరాజ్యం? ఎందుకు జీవించడం? భరతనుడికి రాజ్యం అప్పగించి సీతతో ఏ అరణ్యాలకో వెళ్లిపోయేవాణ్ణి కదా. ఇదే పనేమిటి అని బాధ పడ్డాడట. సుగ్రీవుడిపై అంత ప్రేమ. సుగ్రీవుడేమో నేను మీకు మిత్రుడినా, మావంటి కి నేను దాసోహం అనేవాడిని అన్నాడు.  ఇది ప్రేమా ఆశ్రిత వ్యామోహాలు కదా. ఇదీ సుగ్రీవుడి ఆశ్చర్యం.

గోపికలన్నా, గోదమన్నా, యశోదన్నా, గోవులన్నా ఎంత ప్రేమ ఆశ్చర్యం? అదీ వాత్సలత. అంటూ మాధవ దాసుడి కథ గురించి వివరిస్తూ టిటిడి వక్త, కె ఇ లక్ష్మీనరసింహన్ అని ఇద్దరు తిరుమల శ్రీశ్రీశ్రీ జీయర్ స్వాములు తిరుమల జీయర్ మఠం లో తిరుప్పావై నిర్వహించినఈ 26వ విశేషమైన పాశురం ప్రవచనంలో శ్రీకృష్ణుడు అడిగిన వస్తువులు కోరికల గురించి పరమాత్ముడినే కావలన్నాడనే రహస్యాన్ని అర్థం చేయించారు. 

Also read: తిరుమల జీయర్ మఠంలో మంగళాశాసన పాశురం  

ఈ మాధవదాసు కథ వివరాలు ఇవి.

జగన్నాథ రథయాత్ర ప్రారంభానికి ముందు, ఇది సాధారణంగా తొమ్మిది రోజులు ఉంటుంది. అయితే జగన్నాథుడు రథయాత్రకు ఒకరోజు ముందు అనారోగ్యం నుండి కోలుకున్నాడట. ప్రతి సంవత్సరం, జగన్నాథ పురి ఆలయ ద్వారాలకు పదిహేను రోజుల పాటు తాళాలు వేస్తారు. ఎందుకంటే జగన్నాథుడు రథయాత్ర ప్రారంభానికి ముందు పదిహేను రోజుల పాటు అస్వస్థతతో ఉన్నాడట.

ఈ కాలంలో, దేవతలను ఆలయం లోపల ‘రతన్ వేదిక’ అని పిలిచే ప్రత్యేక అనారోగ్యంతో ఉంచుతారు. దేవతలు 15 రోజుల పాటు ప్రజల దర్శనానికి దూరంగా ఉంటారు. అనారోగ్య కాలాన్ని “అనసారా” అంటారు. వారికి దస-మూల వంటి ప్రత్యేక మూలికలు మరియు అనారోగ్యం సమయంలో ప్రత్యేక ఆహారం ఇవ్వబడుతుంది.వారికి ప్రత్యేక కషాయాలను ఎండుమిర్చి, దాల్చిన చెక్క, పెసరపప్పు, మృదంగం మొదలైనవి నైవేద్యంగా పెడతారు. స్వామివారికి విశ్రాంతిని ఇవ్వడానికి గంటలు, మృదంగం మొదలైన వాటిని నిలిపివేస్తారు.

ఆయుర్వేద మందులు, ఔషధ ముద్దలు ఇస్తారు, కస్తూరితో పాటు వివిధ నూనెలు విగ్రహాలకు పూస్తారు.  ఆషాఢ శుక్ల ప్రతిపదం వరకు ఆలయంలో దర్శనానికి అనుమతి లేదు. కొందరు పూజారులు రహస్యంగా పూజలు చేస్తారు.ఈ కాలం తరువాత, ప్రజలు రథయాత్రకు ముందు రోజున వారి దేవతల మొదటి సంగ్రహావలోకనం పొందుతారు, ఈ రోజున దేవతలను తిరిగి చిత్రీకరించి, భక్తుల కోసం ప్రధాన వేదికపైకి తీసుకువస్తారు, దీనిని ‘నవ యౌవన దర్శనం’ అని పిలుస్తారు. దీనినే ‘నేత్రోత్సవం’ అని కూడా అంటారు. మరుసటి రోజు రథయాత్ర ఉత్సవం జరుపుకుంటారు.

జగన్నాథుడు తన భక్తుల కష్టాలను చూడలేడు

జగన్నాథునికి మాధవదాసు అనే భక్తుడు ఉండేవాడు. అతనికి ఉన్న ఏకైక స్నేహితుడు జగన్నాథుడు, చూడగలిగే ఏకైక కుటుంబం, సందర్శించిన ఏకైక పొరుగువాడు జగన్నాథుడు.  భగవంతుడు జగన్నాథుడు మాత్రమే ఉంది. మాధవదాస్ ఒకరోజు తీవ్ర అస్వస్థత.  జ్వరం బాగా పెరిగిపోయి, తినడానికి కూడా లేవలేని స్థితి. జగన్నాథుడు యాత్రికుడిలా మారువేషంలో ఉండి, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని పాలిచ్చేవాడు.  మాధవదాస్ పూర్తిగా మేల్కొని ఉన్నప్పుడు, తన భగవంతుడు జగన్నాథుడే అని చూశాడు. భగవానుడే తనను చూడడానికి రావడంతో మాధవదాసు ఆశ్చర్యపోయాడు. 

నిజానికి పాలిచ్చే బదులు ఈ ప్రభువు అనారోగ్యాన్ని సులభంగా తరిమికొట్టగలడు. అంటూ “ఓ దేవా, నీవు సర్వశక్తిమంతుడివి కాబట్టి, నన్ను నయం చేయడం కంటే నాకు పాలివ్వడాన్ని ఎందుకు ఎంచుకున్నావు?” దానికి “జీవితంలో ముందుగా నిర్ణయించినవి కొన్ని ఉన్నాయి, వాటిని దేవుడు కూడా మార్చలేడు” అని ప్రభువు జవాబిచ్చాడు. మాధవ దాస్ కృంగిపోయి, “ప్రభూ, మీరు దీన్ని చేయలేరు” అని వేడుకున్నాడు. నేను పాపిని, నువ్వు పరమాత్మవి. మీరు నాకు సేవ చేయలేరు”కానీ ప్రభువు పట్టుదలతో ఉన్నాడు. ప్రభువు అతనికి 15 రోజులు సేవ చేశాడు. మాధవ దాస్ ‘‘నేను తినడానికి నిరాకరిస్తాను మందులు తీసుకోను ఎందుకంటే నేను మీకు సేవ చేయడం కంటే చనిపోవడం మంచిది, ప్రభూ, మీ కర్మ ప్రకారం మీరు ఇంకా 15 రోజులు ఈ అనారోగ్యంతో బాధపడాలి” అని భగవంతుడు సమాధానం చెప్పాడు.‘‘నేను కోరుకుంటే, నేను మీ బాధను ఇప్పుడే ముగించగలను, కానీ మిగిలిన 15 రోజులు పూర్తి చేయడానికి మీరు మళ్లీ జన్మనివ్వాలి, మీరు చేయకూడదనుకుంటున్నాను’’.

“దానికోసం పుట్టి రావాలి’’ అని చెప్పాడు. ‘‘నువ్వు ప్రసవించనవసరం లేకుండా నేను నిన్ను నయం చేయగల ఏకైక మార్గం రాబోయే 15 రోజులు నీ వేదనను తనపైకి తెచ్చుకోవడమే. జగన్నాథుడు దేశ రాజుకు సేవకులకు “నేను అనారోగ్యంతో ఉన్నాను” అని చెప్పివారు 15 రోజుల పాటు దర్శనాన్ని మూసివేసి, స్వామికి “ఔషధం” ఇచ్చారు.
అయితే భగవంతుడు ప్రతి సంవత్సరం 15 రోజులపాటు జబ్బు పడి చికిత్స పొందుతున్నాడని తెలుసా?.జగన్నాథ్ పూరీ యాత్రకు పదిహేను రోజుల ముందు, జగన్నాథుడు అనారోగ్యానికి గురవుతాడు ఆలయ ద్వారాలు మూస్తారని తెలుసా?.

అనారోగ్యంతో ఉన్న కాలంలో, భక్తులు సాధారణంగా పూరీ పట్టణం వెలుపల 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మగిరి వద్ద ఉన్న అలర్నాథ్ ఆలయానికి భగవంతుని దర్శనం ప్రత్యేకంగాఏర్పాట్లు చేస్తారు. పూరిలో అనారోగ్యం సమయంలో, జగన్నాథుడు అలార్నాథ్ ఆకారంలో కనిపిస్తాడట. (ఈ కథ వివరాలు https://shree1news.com/story-behind-why-puri-lord-jagannath-falls-ill-for-15-days-every-year/ చదువుకోవచ్చు)అంతే కాదు. చివరకు ఈ భగవంతుడే మాధవదాసు అమలినమైన వస్త్రాలను ఉతికేవాడని అంటారు. ఎందుకంటే ఆ కర్మ భగవంతుడు కాక మరెవరు చేస్తారు. అని 15 రోజులు జ్వరం బాధపడతారు అని ఈ కథను శ్రీ లక్మీ నరసింహన్ వివరించారు.

Also read: నరసింహుడికే సర్వవ్యాపకత్యం

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles