Friday, April 26, 2024

దిల్లీ గులాములు దళితబంధు అమలు చేయలేరు: కేసీఆర్

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదికగా దళితబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళిత బంధు దళితులతో ఆగదని… గిరిజనులు, బీసీ, ఓసీల్లో ఉన్న నిరుపేదలకు కూడా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. చాలామంది కిరికిరిగాల్లు అవగాహన రాహిత్యంతో అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అలాగే దళిత బంధు సంపూర్ణ విజయం సాధిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 17లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని… లక్షా80వేల కోట్లు అవసరం ఉంటుందని సీఎం తెలిపారు. వచ్చే ఏడేళ్లలో తెలంగాణ 23లక్ష కోట్లు ఖర్చు పెట్టబోతోందని చెప్పారు. దళిత బంధులాంటి పథకం అమలు చేసేందుకు కాంగ్రెస్, బీజేపీకి అవకాశం ఉన్నా ఎందుకు ఈ ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. శాశ్వత పేదరిక నిర్మూలనకు కృషి చేయలేదన్నారు. ఢిల్లీ గులాములు ఈ పనులు చేయలేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంటే చేస్తాయా… వారికి ఇది చేయడానికి ఢిల్లీ అనుమతి ఇస్తుందా? అని నిలదీశారు. ఢిల్లీ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ చేయడమే వాళ్ల బతుకులు అని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles