Friday, April 26, 2024

రాష్ట్రంలో 2 తేదీ వరకు సభలు, ర్యాలీలపై నిషేధం – డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్, ఓమైక్రాన్ నియంత్రణలో భాగంగా  జనవరి 2 వ తేదీ  వరకు ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధిస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల ఎస్,పీ. లకు, పోలీస్ కమీషనర్ల ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కోవిడ్ నిబంధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన  సూచనలను అమలు చేస్తున్నామని, ప్రతీ ఒక్కరు  విధిగా మాస్కులను ధరించడంతోపాటు, సామాజిక దూరం పాటించాలనే అంశాలపట్ల  ప్రజలను  చెతన్య వంతులను చేస్తున్నామని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించని వారికి నిబంధనలను అనుసరించి వెయ్యు రూపాయల ఫైన్ ను విదించనున్నామని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అనుమతి పొందిన కార్యక్రమాలలో విధిగా కోవిద్ నియమ, నిబంధనలను పాటించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను కోరామని డీజీపీ మహేందర్ రెడ్డి నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియ చేశారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles