Monday, April 29, 2024

జలాశయాలుఎండిసాగు, తాగునీటి ఎద్దడిమొదలయ్యింది

డా. యం. సురేష్ బాబు, అధ్యక్షులు,  ప్రజాసైన్స్ వేదిక

అనంతపురం జిల్లాలో సాంప్రదాయ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్ సిస్టమ్‌ల ప్రాముఖ్యత, వ్యవసాయ అభివృద్ధి  గ్రామీణ జీవనోపాధిలో వాటి పాత్ర పూర్తిగా విస్మరించబడింది. జనాభా ఒత్తిడి,  పేలవమైన నిర్వహణతో సహా ఈ వ్యవస్థలు ఎదుర్కొన్న సవాళ్లు, నీటిపారుదలకి, వాటి ప్రాముఖ్యత అలాగే  సహకారంలో క్షీణతకు దారితీశాయి.  సాంప్రదాయ వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్ వ్యవస్థలు చారిత్రాత్మకంగా గ్రామీణ భారతదేశంలో కీలక పాత్ర పోషించాయి.  తాగునీరు  రక్షిత నీటిపారుదల, వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడం గ్రామీణ వర్గాల జీవనోపాధి వంటి వివిధ సేవలు  చెరువుల సంరక్షణ ద్వారా ఉండేది.

Also read: సంతోష సూచిక లేని దేశంలోవికసిత భారత్ సాధ్యపడేనా?

కాలక్రమేణా, ఈ సాంప్రదాయ ట్యాంక్ వ్యవస్థ సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. జనాభా పెరుగుదల, చెరువులు అన్యాక్రాంతం కావడం,  సరిపడని నిర్వహణ  ట్యాంకుల క్షీణతకు దారితీసింది. ఉదాహరణకు, 2000-01, 2010-11 మధ్య ఉపయోగంలో లేని ట్యాంకుల సంఖ్య రెట్టింపు అయింది. 1950-51 – 2021-22 మధ్య భారతదేశంలో మొత్తం నీటిపారుదల శాతంలో ట్యాంక్ నీటిపారుదల వాటా గణనీయంగా తగ్గింది.  ఇది 17% నుంచి 2.15%కి పడిపోయింది. ఈ సంప్రదాయ వ్యవస్థల బహుళ ప్రయోజనాలు గుర్తిస్తూ, ట్యాంక్ పునరుద్ధరణ భారతదేశంలో కేంద్ర  రాష్ట్ర స్థాయిలలో విధాన ప్రాధాన్యతగా మారింది.

అనంతపురం జిల్లాలో దారుణ పరిస్థితి

కరువు పీడిత అనంతపురం జిల్లాలో గత దశాబ్ద కాలంగా వర్షపు నీటి నష్టంతో పాటు నీటి పరిస్థితి దారుణంగా ఉంది. సమర్ధవంతంగా వాన నీటి సంరక్షణ చర్యలు అవసరం. గత రెండు దశాబ్దాలుగా అనంతపురం జిల్లాలో వర్షపు నీరు గణనీయంగా తగ్గిపోయింది. ప్రత్యేకంగా, అనంతపురం జిల్లాలో  మూడు వేల టిఎంసి  వర్షపు నీటిని కోల్పోయింది. 2000 నుంచి 2022 వరకు జిల్లాకు అందిన మొత్తం 4,518 టీఎంసీల నీటిలో 541.9 టీఎంసీలకు సమానమైన 12 శాతం మాత్రమే భూగర్భ జలాలుగా నిలిచిపోయాయి. మిగిలిన నీటికి వివిధ రూపాలలో,   40 శాతం ప్రవహిస్తుంది, 40 శాతం బాష్పీభవనం ద్వారా పోతుంది. ఎనిమిది శాతం నేల తేమ గా మిగిలిపోయింది. జిల్లాలో వివిధ సామర్థ్యాలతో కూడిన అనేక ట్యాంకులు ఉన్నప్పటికీ గత 20 ఏళ్లలో ఒక్కటి కూడా గరిష్ట సామర్థ్యం మేరకు నింపలేదు. ఈ ట్యాంకుల్లో మీడియం నీటిపారుదల ట్యాంకులు, ఇతర రిజర్వాయర్లు ఉన్నాయి, మొత్తం నిల్వ సామర్థ్యం 15 నుంచి 20 టిఎంసి  వరకు ఉంటుంది. జిల్లాలో 194 పైజోమీటర్లు వర్షపాతం డేటాను నమోదు చేస్తున్నాయి. ఈ రికార్డింగ్‌లు కేవలం 12 శాతం వర్షపు నీటిని మాత్రమే భూగర్భ జలాలుగా నిలుపుకున్నాయని సూచిస్తున్నాయి.  వర్షపు నీటి నిల్వలు పెంచడానికి, మరిన్ని భూగర్భ ఆనకట్టల నిర్మాణాన్ని ప్రకరణం సూచిస్తుంది. భూగర్భ ఆనకట్టలు వర్షపు నీటిని భూగర్భంలో నిలుపుకోవడంలో సహాయపడతాయి, ప్రవాహాలు, బాష్పీభవన నష్టాలను తగ్గిస్తాయి.  కరువు పరిస్థితులను తగ్గించడంలో కీలకమైన వర్షపు నీటికి అనంతపురం జిల్లా గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొంది. నీటి కొరతను పరిష్కరించడానికి ఈ ప్రాంతంలో నీటి లభ్యతను మెరుగుపరచడానికి ఉపరితల ఆనకట్టల వంటి సమర్థవంతమైన వర్షపు నీటి సంరక్షణ చర్యలు అవసరం.   మిషన్‌ అమృత్‌ సరోవర్‌ పథకం కింద ఎంపికైన చెరువుల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపడతారు. 10 వేల క్యూబిక్‌ మీటర్ల మేర నీటిని నిల్వ చేసేలా కొలతలు తీసుకుని ఒండ్రుమట్టిని తీస్తారు. ఆ మట్టిని పొలాలకు తరలించేందుకు, కట్ట పటిష్టానికి ఉపయోగించనున్నారు. కట్టపై పెరిగిన ముళ్ల పొదలు తొలగిస్తారు. ఒక్కొక్క చెరువుకు రూ. 10 లక్షలతో పాటు అవసరమైతే 15వ ఆర్ధిక సంఘం నిధులు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు  కానీ ఎక్కడా పనులు ఆశాజనగంగా జరగలేదు. రాయలసీమ ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీలో ప్రస్తుతం మొత్తం 17.75 లక్షల జాబ్‌ కార్డులుండగా దాదాపు 6 లక్షలు పైగా పనులకు హాజరవుతారని అంచనా వేశారు. మిషన్‌ అమృత్‌ సరోవర్‌ పథకం కింద పని కల్పించి కూలీల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ప్రతి చెరువు కింద లక్ష పని దినాలు కల్పించాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు.

Also read: కరువు నివారణకు సమగ్ర వ్యూహం అవసరం 

మరమ్మతుకు నోచుకోని కాల్వలు

జిల్లా నీటి యాజమాన్యం నీరును వడిసిపట్టే చర్యలు ఇంత వరకు చేపట్టక పోవడం వలన చాలా కాలువలు మరమ్మత్తులకు నోచుకోక పిచ్చి కంప, కాలువలు పూడుకు పోతున్నాయి. టీబీ డ్యాం ప్రస్తుత నీటి నిల్వలు   ఆశాజనకంగా లేదు,  హెచ్చెల్సీ కి నీరు జులై 15 న వదలడం ఆనవాయితీగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కర్ణాటక, కణేకల్లు ప్రాంతంలో  68 కిమీ నుండి 94 కిమీ వరకు కాలువ ప్రమాదకరంగా మారింది. పలు చోట్ల  కాలువకు గండి పడి కొన్ని వేల క్యూసెక్కుల నీరు వృధా అవుతున్నది. భైరవాని తిప్ప ప్రాజెక్టు బీటలు వారి నీరు వృథా అవుతోంది.  మరమత్తు పనులు నాసిరకంగా ఉన్నాయి.  గండ్లు పడ్డప్పుడు  యుద్ధప్రాతిపదికన రాత్రి పగలు పనిచేసే అధికారులు మిగతా సమయాలలో తనిఖీ చేయరు. గతంలో పైపింగ్ పడిన ప్రాంతంలోనే  పదే పదే గండి పడుతున్నది. శాశ్వత మరమ్మత్తులకు నిధులు కేటాయించక  ఐదు  సంవత్సరాలైంది. జీడిపల్లి రిజర్వాయిర్  పరిస్థితి అంతే, 2012 లో కృష్ణ జలాలు నింపారు. రిజర్వాయిర్ కిందనే గ్రామం ఉండటంతో ఊట నీరు గ్రామంలో ఏరులై పారుతున్న పట్టించుకునే నాథుడే లేడు. గ్రామాన్ని తరలించి మిట్ట ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని అందుకు 52 కోట్లతో ప్రణాళిక రూపొందించి నాలుగేళ్లు  అవుతుంది.    కెనాల్ ఆధునీకరణ పనులు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా జరుగుతున్నది. కాలువల మరమ్మత్తులకు డబ్బు కేటాయించలేదు. కెనాల్స్ పాతవి అయిపోయాయి, రెగ్యూలేటర్లు పనిచేయడం లేదు.   డ్యామ్ సామర్థ్యం పెంచడానికి ఏమాత్రం చర్యలు చేపట్టక పోవడం, డ్యాంలో సిల్ట్ బాగా ఎక్కువ కావడంతో అనుకున్నంత స్థాయిలో జిల్లా వాసులకు సాగునీరు అందించేందుకు అధికారులు సతమతమవుతున్నారు.  చెరువులకు నీరు అందించే ప్రక్రియ సరిగా లేదు.

ఎవరి నియోజక ప్రయోజనాలు వారివి

ఎవరికీ తోచినట్లు వారు వారి నియోజక ప్రయోజనాల కోసం  చెరువులకు నీరు నింపడం జరుగుతున్నది.  సాగునీటి అవసరాలను  జిల్లా ప్రజాప్రతినిధులు ఎప్పుడు ప్రస్తావించిన పాపాన పోలేదు. చెరువులకు వెళ్లే కాలువలు మరమ్మత్తులకు నోచుకోక పదిహేను   సంవత్సరాలు అవుతుంది. గుంతకల్లు నియోజకవర్గంలో కరిడికొండ, భేతేపల్లి, బాచుపల్లి, వన్నెదొడ్డి తీవ్ర నీటి ఎద్దడి ఉంది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. టీబీ డ్యాం నీటి లభ్యత, హెచ్చెల్సీ కోటా, తాగు, సాగునీటి అవసరాల, ప్రాధాన్యత హేతు బద్దంగా లేదు . ఏటా తుంగభద్ర నుంచి వచ్చే నీటిని ఎగువ ప్రాంతాల్లో ఆయకట్టుకు ఇస్తూ దిగువన ఉన్న పీఏబీఆర్, ఎంపీఆర్, సీబీఆర్‌లకు కూడా ఇచ్చేవారు. అయితే హెచ్చెల్సీ పరిధిలో తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల నీరు అవసరం. గత సంవత్సరం  జరిగిన సమీక్షలో హెచ్చెల్సీకి ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో నీరిస్తామని టీబీబోర్డు స్పష్టం చేసిందన్నారు. 20 రోజులు ఆన్, 10 రోజులు ఆఫ్‌ పద్ధతిలో నీటిని విడుదల చేస్తామన్నారని వివరించారు. టీబీడ్యాం నుంచి ఎంపీఆర్‌కు నీరు చేరాలంటే కనీసం 30 రోజులు పడుతుందన్నారు. 20 రోజులు విడుదల చేసి పదిరోజులు నీటి విడుదల ఆగిపోతే నీరు చేరదు. అందుకే మొదటి 30 రోజులు నీటిని విడుదల చేసి, ఆపై 10 రోజులు కావాలంటే ‘ఆఫ్‌ పద్ధతి’లో కర్ణాటకకు వినియోగించుకోవాలి. అలా కాకుండా దామాషా ప్రకారం నిరాటకంగా నీరు విడుదల చేస్తే 1100 క్యూసెక్కులు ఇచ్చిన సరిపోతుంది.  టీబీడ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలకు తగ్గితే హెచ్చెల్సీ ద్వారా చుక్కనీరు కూడా తీసుకునే అవకాశం ఉండదు, అందుకే నీటి సామర్థ్యం 16 టీఎంసీలకు చేరకముందే కోటా మేర నీటిని తీసుకోవాలి.  శ్రీశైలం నుంచి కూడా నీరు వచ్చే అవకాశం ఉంది, దీన్ని కూడా  సాగు తాగునీటి అవసరాలకు వినియోగించాలి.  సీబీఆర్‌ పూర్తిగా అడుగంటిపోవడం, ఎంపీఆర్‌లో నీరు లేకపోవడం, పీఏబీఆర్‌ ప్రమాదకరస్థాయిలో ఉండటంతో ప్రజాప్రతినిధులు ఎవరికివారు తమ ప్రాంత అవసరాల గురించి మాట్లాడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన జిల్లాలో అన్ని ప్రాంతాలకు  తాగునీరు అందించి, సత్వరమే సాగు నీటికి ప్రణాళిక రూపొందిస్తే  వచ్చే వర్షాలు నీటిని నిలువ చేసుకునే దిశగా  ప్రయత్నం చేయాలి.  ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో కనీస వేతనం 150 నుంచి 200 వరకు వేతనం అందుతుండటంతో కూలీలు వాపోతున్నారు. ఈ పథకం ద్వారా పని దినాలు పెంచి వేతనం పెంచడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి.  సరోవరం పథకం ద్వారా చెరువుల రూపురేఖలు మారడంతో పాటు ఉపాధి పని దినాలు పెరగనున్నాయి. ఈ పథకానికి సంబంధించి సత్వరమే  అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో వేగంగా పనులకు శ్రీకారం చుట్టాలి.

Also read: రైతు సంక్షేమం లేదు సంక్షోభం మిగిలింది

Dr. M. Suresh Babu
Dr. M. Suresh Babu
Dr. M. Suresh Babu has been a Professor, Dean and Principal in various engineering colleges and institutions in Hyderabad and Anantapur. His approach to teaching is “For the student, by the student and to the student.” He is associated with several Civil Society Organizations like Praja Science Vedika and Election Watch.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles