Friday, April 26, 2024

కోటి 42 లక్షల ఎకరాలలో వానాకాలం సాగు

  • 70 నుండి 75 లక్షల ఎకరాలలో పత్తి
  • 50 లక్షల ఎకరాలలో వరి
  • 15 లక్షల ఎకరాలలో కంది
  • 11.5 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు

వానాకాలం సాగు ప్రణాళికపై హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి , విత్తనసంస్థ ఎండీ కేశవులు,  మార్క్ ఫెడ్ ఎండీ యాదవరెడ్డి తదితరులు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గత ఏడాది పత్తి వేయకుండా రైతులు నష్టపోయారు .. ఈ ఏడాది రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలనీ,  రాష్ట్రంలో 1332 పత్తి ఎక్కువ సాగు చేసే క్లస్టర్లు, వెయ్యికి పైగా వరి సాగు చేసే క్లస్టర్లు, 82 కంది సాగు చేసే క్లస్టర్లను గుర్తించామనీ,  క్లస్టర్ల వారీగా పంట ప్రణాళికలు సిద్దం చేశామనీ మంత్రి చెప్పారు.

ఆయా పంటలకు కావాల్సిన విత్తనాలను సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పచ్చి రొట్ట ఎరువులను ప్రోత్సహించి భూసారం పెంచే దిశగా రైతులను సన్నద్దం చేయాలనీ, మే నెలలో వీటిని రైతులకు పంపిణీ చేయాలనీ, కల్తీలేని నాణ్యమైన విత్తనాల సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలనీ, కల్తీని నిరోధించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలనీ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేయాలనీ మంత్రి అధికారులకు చెప్పారు.

పంటల ప్రణాళిక ప్రకారం ఎరువులను సిద్దంగా ఉంచాలనీ, మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు తీసుకోవాలనీ, రష్యా – ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో అన్ని ఎరువులు ముందస్తుగా అందుబాటులో ఉండేలా చూడాలనీ, దీనికి సంబంధించి మార్క్ ఫెడ్, వ్యవసాయ శాఖ తక్షణం చర్యలు చేపట్టాలనీ, మే నెలలో క్షేత్రస్థాయిలో పర్యటించి వానాకాలం పంటల ప్రణాళికపై క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన  కార్యక్రమాలను నిర్వహించాలనీ, పంటల ప్రణాళికపై జిల్లాల వారీగా ఏఈఓలకు శిక్షణ కల్పించాలనీ

ఆయిల్ పామ్ సాగు కోసం వ్యవసాయ – ఉద్యాన అధికారులు సమన్వయంతో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాలనీ, దీని కోసం వ్యవసాయ – ఉద్యాన అధికారులతో ఉమ్మడి సమావేశం నిర్వహించాలనీ, రైతువేదికలను అవగాహన కోసం కోసం విరివిగా ఉపయోగించుకోవాలనీ,  రైతుబంధు సమితులకు భాగస్వామ్యం కల్పించాలనీ అధికారులకు చెప్పారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles