Friday, April 26, 2024

దత్తాత్రేయకు తృటిలో తప్పిన ప్రమాదం

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. ఘటనలో దత్తాత్రేయ సహాయకుడికి స్పల్ప గాయాలు కావడంతో చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. అనంతరం దత్తాత్రేయ పర్యటన నిమిత్తం వేరే వాహనంలో సూర్యాపేట బయలు దేరి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు.   

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles