Saturday, April 27, 2024

చుక్కా రామయ్యతో దత్తాత్రేయ భేటీ

హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎంఎల్ సీ చుక్కారామయ్యను ఆదివారం ఉదయం హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కలుసుకున్నారు. ఉదయం పదకొండు గంటలకు విద్యానగర్ లో రామయ్య నివాసానికి వచ్చిన గవర్నర్ అరగంట సేపు కూర్చొని అనేక అంశాలు చర్చించారు. రామయ్య యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఇటీవల రామయ్య జన్మదినం సందర్భంగా దత్తాత్రేయ ఫోన్ చేసి సాధ్యమైనంత తొందరలో వచ్చి కలుసుకుంటానని చెప్పారు. రామయ్య, దత్తాత్రేయ పలు దశాబ్దాలుగా సన్నిహిత మిత్రులు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles