Friday, April 26, 2024

భారత్ తో టీ-20 సిరీస్ కు ఇంగ్లండ్ జట్టు

  • 16 మంది సభ్యులజట్టుకు మోర్గాన్ నాయకత్వం
  • అహ్మదాబాద్ వేదికగా 5 మ్యాచ్ ల టీ-20 సిరీస్

భారత్ తో అహ్మదాబాద్ సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా వచ్చేనెలలో జరిగే ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో పాల్గొనే 16 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. టీ-20 స్పెషలిస్ట్ వోయిన్ మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టులో బెన్ స్టోక్స్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జోస్ బట్లర్, ఓపెనర్ డేవిడ్ మలన్, జానీ బెయిర్ స్టో, ఆర్చర్, మోయిన్ అలీ లాంటి హేమాహేమీ ఆటగాళ్లున్నారు.

జట్టులోని ఇతర ఆటగాళ్లలో సామ్ బిల్లింగ్స్, సామ్ కరెన్, టామ్ కరెన్, క్రిస్ జోర్డాన్, లైమ్ లివింగ్ స్టన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, రీసీ టోప్లే, మార్క్ వుడ్ ఉన్నారు. ఇంగ్లండ్ జట్టు సభ్యులు ఫిబ్రవరి 26న ఇంగ్లండ్ నుంచి భారత్ కు చేరుకోనున్నారు.వారంరోజుల క్వారెంటెన్ అనంతరం నెట్ ప్రాక్టీసు ప్రారంభించనున్నారు. ఇంగ్లండ్ జట్టు తన పర్యటన కాలంలో మూడుమ్యాచ్ ల వన్డే, నాలుగు మ్యాచ్ ల టెస్టు, ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ల్లో భారత్ తో తలపడనుంది.

ఇదీ చదవండి : రెండో టెస్టుకు ఆర్చర్ దూరం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles