Monday, April 29, 2024

ఏపీది దుందుడుకు చర్య: సాగునీటి  విడుదలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్  ప్రభుత్వం నీటి విడుదల చేయడం పట్ల  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు. గురువారం కిషన్ రెడ్డి విలేకర్ల తో మాట్లాడారు. ఏపీ ది దుందుడుకు చర్యగా ఆయన అభివర్ణించారు. సాగు నీటి విడుదలకు తాము వ్యతిరేకం కాదని అన్నారు.  ఐతే నీటి విడుదలలో కేంద్రంతో సంప్రదించి ఉంటే సబబుగా ఉండేదని అయన అభిప్రాయపడ్డారు.  తెలంగాణ అధికారులతో చర్చించి నీటి విడుదల చేసివుంటే  ఆమోదంగా ఉండేదని అయన అన్నారు. నీటి అవసరాలను  దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటే  వివాదాలు  రావన్నారు. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల చేయడం సమంజసం కాదన్నారు. చర్చలు జరగకుండా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం  పట్ల అయన అసంతృప్తి వ్యకం చేసారు. ఏకపక్షంగా  ఏపీ నిర్ణయం తీసుకోవడం సహేతుకంగా లేదన్నారు.

C.S. Kulasekhar Reddy
C.S. Kulasekhar Reddy
కులశేఖర రెడ్డి 1992 నుంచి ఆంధ్రభూమి లో పనిచేశారు. వ్యవసాయం, నీటి పారుదల, విధ్యుత్ రంగాలపై పలు వ్యాసాలు రాసారు. అనంతపురం, చిత్తూరు, విజయవాడ, కడప, కర్నూల్, హైదరాబాద్ లలో 27 సంవత్సరాలు విలేఖరిగా పని చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles