Thursday, May 2, 2024

టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయండి

డా. యం. సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక 

భారత  ఉపఖండంలో  లోతైన  ప్రాంతంలో   నంద్యాల జిల్లా  డోన్  నియోజకవర్గంలో  బోయపల్లి  గ్రామంలో  దాదాపు  ఒక కిలోమీటర్  విస్తీర్ణంలో  సహజంగా ఏర్పడ్డ గుహలను  కనుగొన్నారు.  ఈ గుహలు  రాయలచెరువు నుండి  కేవలం  పది కిలోమీటర్ల దూరంలో  ఉన్నవి.  గుహల్లో   శివుడి లింగం ప్రత్యేక ఆకర్షణగా  నిలుస్తుంది.  గాలి  సర్కులేషన్ కోసం  నాలుగు  ఫ్యాన్లను అమర్చారు.  ఎక్కువమంది ప్రజలు సందర్శించినప్పుడు  ఫ్యాన్లు సరిపోవు.  బెలుం గుహలకు  బయట నుండి  బ్లోయర్ సహాయంతో  దాదాపు  ఆరు ఏడు చోట్ల  గాలి సౌకర్యం ఉంది.  ఇప్పుడిప్పుడే  బోయపల్లి  గుహలు ప్రజల సందర్శనార్థం పంపుతున్నారు.  నడక మార్గంలో  కొన్ని  మరమత్తులు  చేస్తున్నారు.  చేయవలసిన  పనులు  చాల ఉన్నాయి. 

టూరిజం  సర్క్యూట్ ఏర్పాటు చేసి  గుత్తి కోట, మన్రో  సమాధి, హంపన్న  సమాధి,  బోయపల్లి  గుహలు, బెలుం గుహలు, తాడిపత్రి పట్టణంలో చింతల వెంకటరమణ స్వామి గుడి   ప్యాకేజిగా  పెట్టి  బస్సులు నడిపితే ఈ ప్రాంతంలో వెలసిన  పురాతన, చారిత్రిక ప్రదేశాలను  విద్యార్థులకు తెలియజేసిన వారవుతారు.   ఆంధ్ర ప్రదేశ్‌లోని బెలుం గుహలు అని కూడా పిలువబడే బెలుమ్ గుహలు, భారత ఉపఖండంలో ప్రజలకు తెరిచిన రెండవ పొడవైన గుహ. 3,229 మీ (10,593.8 అడుగులు) కొలిచే ఈ గుహ మేఘాలయలోని క్రెమ్ లియాట్ ప్రాహ్ గుహల తర్వాత రెండవ సహజ గుహ. ఈ గుహలు స్టాలక్టైట్, స్టాలగ్మైట్ నిర్మాణాల వంటి వాటి స్పెలియోథెమ్ నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాయి.  పొడవైన మార్గాలు, ఇరుకైన గ్యాలరీలు, మంచినీటితో నిండిన విశాలమైన ట్యాంకులు కలిగిన ఈ గుహ వెయ్యి సంవత్సరాల కంటే పాతది,  కొంత కాలం పాటు భూగర్భ జలాలు నిరంతరం ప్రవహించడం వల్ల ఏర్పడింది. పాతాళగంగ అని పిలువబడే గుహ ప్రవేశద్వారం 46 మీటర్ల లోతు, దాదాపు 151 అడుగులతో గుహ యొక్క లోతైన ప్రదేశం.      అనేక శతాబ్దాల క్రితం జైన, బౌద్ధ సన్యాసులు ఈ గుహలను ఆక్రమించారని అనేక సూచనలు ఉన్నందున ఈ గుహలు అపారమైన చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. గుహలోపల లభించిన అవశేషాలను అనంతపూర్‌లోని మ్యూజియంకు తరలించారు. భారత పురావస్తు సర్వే (ASI) 4500 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన బౌద్ధమతానికి పూర్వపు నౌకలను కనుగొంది. బెలూమ్ గుహలు మొదటిసారిగా బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అయిన రాబర్ట్ బ్రూస్ ఫూట్ చేత 1884 సాహసయాత్ర నివేదికలో రికార్డ్ చేయబడ్డాయి. కానీ ఆ తర్వాత ఇవి అనేక దశాబ్దాలుగా గుర్తించబడలేదు.   చాలా కాలం తరువాత 1982, 83 లో, జర్మన్ బృందం ఒక సర్వే నిర్వహించి, ఈ గుహలను క్షుణ్ణంగా అన్వేషించింది.

కర్నూల్ జిల్లాలోని బెలుం గ్రామంలో ఉన్న బెలుం గుహలను వ్యర్థ పదార్థాలను డంప్ చేయడానికి ఉపయోగించేవారు.  గ్రామస్తులతో పాటు పోలీసులు  ఆంధ్ర ప్రభుత్వం చాలా కష్టపడి గుహలను శుభ్రం చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది.  20 సంవత్సరాల శ్రమ తర్వాత, ఈ గుహలను 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షిత ప్రదేశంగా ప్రకటించింది.    1999 లో  రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా బెలూం గుహ అభివృద్ధి ప్రారంభమైంది,  2002 నాటికి, గుహలు ప్రజల సందర్శనార్థం తెరవబడ్డాయి.  లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు  డా  యం. విరూపాక్ష రెడ్డి,  ప్రొ . జి. వెంకటశివా రెడ్డి, 100 టిఎంసి రామాంజనేయులు,  ప్రొ  మంచి శరత్ బాబు తదితరులు  విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

Dr. M. Suresh Babu
Dr. M. Suresh Babu
Dr. M. Suresh Babu has been a Professor, Dean and Principal in various engineering colleges and institutions in Hyderabad and Anantapur. His approach to teaching is “For the student, by the student and to the student.” He is associated with several Civil Society Organizations like Praja Science Vedika and Election Watch.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles