Friday, April 19, 2024

ఏమైపోయాయ్

నీలి మేఘాలు, పచ్చని పచ్చిక బయళ్లు

గలగల పారే సెలయేళ్ళు

oఝా మారుతం లాంటి జలపాతాలు

పారదర్శక ముసుగేసుకున్న నీలి కొండలు

వెలుతురు జల్లెడ పట్టే అరణ్యాలు

నిత్య వసంతాన్ని తలపించే చిగురాకులు

ఎలా పోయాయి? ఏమైపోయాయ్?

కొండలు పిండి చేశాం

నేలతల్లి పేగులు పెకలించాం

అరణ్యాలు అరుదు చేశాం

రోదసీలోకి రాకెట్లు పంపాం

ఎంతో అభివృద్ధి సాధించాం.

పుడమితల్లికి పురిటి నెప్పులు రాకుండా చేశాం

నేల చాలక ఆకాశం లోకి ఎదుగుతున్నాం

నీరులేక ఉప్పునీటిని శుద్ధి చేసే పనిలో ఉన్నాం

పరమాన్నాలు వదలి పిజ్జాలు తింటున్నాం

పక్కవాడితోకాక చరవాణితో జత కట్టాం

కొండలకు గుండుగీసి మన నెత్తి మీదకు కుంపట్లు తెచ్చుకున్నాం

ఇంకా మనకు మేఘాలు అరణ్యాలు కావాలా

మనమేగా వాటిని మేసేస్తున్నాం.

Also read: అన్వేషి

Also read: కుపిత

Also read: మేలుకో ఓటరూ!

Also read: అంత్య ఘడియలు

Also read: భూతలస్వర్గం కశ్మీర్

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles