Monday, March 20, 2023

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులు

  • జనాన్ని ఆకట్టుకునేందుకు అధికారుల యోచన 
  • 15 ఏళ్లుగా ఒకే రంగుతో పాతబడ్డలుక్‌

 తెలంగాణలో ఆర్టీసీ బస్సుల రంగులు మారబోతున్నాయి. ప్రయోగాత్మకంగా తొలుత సిటీ బస్సుల రంగు మార్చాలని ఆర్టీసీ భావిస్తోంది. తీవ్ర నష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు కొత్త ఎండీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో వేగంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, బస్సులు చూడగానే ఆకట్టుకునేలా కనిపించాలని సంస్థ భావిస్తోంది.

చాలాకాలంగా ఒకే రంగుతో ‘పాతబడ్డ’ బస్సులకు కొత్త రంగులతో కొత్త లుక్‌ తేవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా నగరంలో ఆర్టీసీ తీవ్ర నష్టాలు మూటగట్టుకుంటోంది. కోవిడ్‌తో కునారిల్లి నష్టబోయిన తర్వాత గత నెలరోజులుగా సిటీ బస్సులు మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నా.. మరింత పెరగాల్సిందేనన్న ఉద్దేశంతో ఆర్టీసీ ఉంది. ఇందుకు వాటి రంగులు మార్చడం ద్వారా కొంత ఫలితాన్ని పొందొచ్చని ఆశిస్తున్నారు. 

సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles