Tuesday, April 16, 2024

మహిళా టీ-20లో సరికొత్త ప్రపంచ రికార్డు

  • కివీ క్రికెటర్ సోఫీ మెరుపు శతకం
  • 9సిక్సర్లు, 9 బౌండ్రీలతో ధూమ్ ధామ్ బ్యాటింగ్

ధూమ్ ధామ్ మహిళా టీ-20 క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది. మెరుపువేగంతో శతకం బాదిన మహిళగా న్యూజిలాండ్ ఆల్ రౌండర్ సోఫీ డివైన్ చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్ సూపర్ స్మాష్ టోర్నీలో భాగంగా ఒటాగో స్పార్క్స్ జట్టుతో జరిగిన పోటీలో వెలింగ్టన్ బ్లేజ్ తరపున బ్యాటింగ్ కు దిగిన డివైన్ కేవలం 36 బాల్స్ లోనే మెరుపు సెంచరీ బాది వారేవ్వా అనిపించుకొంది. 31సంవత్సరాల డివైన్ 9 సిక్సర్లు, 9 బౌండరీలతో పరుగుల మోత మోగించింది. 38 బాల్స్ లో 108 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 2010 కరీబియన్ హిట్టర్ దేవేంద్ర డోటిన్ సాధించిన 38 బాల్స్ సెంచరీ ప్రపంచ రికార్డును డివైన్ తెరమరుగు చేసింది. డునేడిన్ లోని యూనివర్శిటీ ఓవల్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన ఈమ్యాచ్ మహిళా టీ-20 క్రికెట్ చరిత్రలో మరో మేలిమలుపుగా మిగిలిపోతుంది.

ఇదీ చదవండి: కంగారూల కోటలో భారత్ పాగా ?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles