Friday, March 29, 2024

నూలుపోగు

చంద్రుడు వచ్చాడు రాత్రిలోకి

వెన్నెలలు కురిపిస్తున్నాడు

మండే గుండెల సెగలకు

ఆ వెన్నెలలు ఆవిరులైపోయాయి

అయినా కురిపిస్తూనే ఉన్నాడు వెన్నెల నిరాశతోనే

రాత్రి భారంగా గడచిపోతూంది.

రవి రాకుండా అరుణాన్ని పంపించాడు ఉషస్సుతో

ఆ తేజస్సులోకి జారిన లోకంలో రాజు మళ్ళీ పుట్టాడు

అది గమనించకుండా చంద్రుడు వెళ్ళిపోయాడు నిద్రలోకి.

మబ్బు తెరలను కప్పిన మంచు తెరలు విడిపోతున్నాయ్

మనసు పొరలను కప్పిన మబ్బు తెరలు విడిపోతున్నాయ్

ఉదయరాగం కనిపిస్తూంది

ముత్యాల సింగారించిన మల్లెమొగ్గ

పెదవులు విప్పి నవ్వేస్తూంది.

Also read: “వలస పక్షులు”

Also read: గోవిందా గోవింద

Also read: త్రిలింగ దేశంలో హత్య

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles