Thursday, April 25, 2024

అప్పుడు

నా చిన్నప్పుడు

డాబా మీద చాపలు పరిచి

వెల్లకిలా పడుకుని

కబుర్లు చెప్పుకుంటూ

నవ్వులు పంచుకుంటూ

వెన్నెల్లో మెరిసే వాళ్లం

సంతోషంతో మురిసే వాళ్లం

ఆనందపు జల్లుల్లో తడిసే వాళ్లం

అవన్నీ ఫోటోలు తీయడం తెలియదు.

చేతులు కాలే పులి బొంగరాలు

ఉఫ్ అంటూ ఊదుకుంటూ

తింటున్నపుడు

పుల్ల అయిస్, పాల అయిస్ చీకుతున్నపుడు

మామిడి రసాలు జుర్రుతున్నపుడు

ఫోటోలు తీసుకునే ఆలోచన లేదు.

రైలు ప్రయాణం అంటే ఎక్కడలేని సంతోషం

ఏసి లేని 3వ క్లాసు బోగీలో

కిటికీ పక్క సీటు కోసం వంతులు వేసుకుని

ఇంటినుండి తెచ్చుకున్న మరచెంబు నీళ్లు

చపాతి కుర్మాల డబ్బాలు

పక్కవాళ్లతో పంచుకునే అలవాట్లు

ఫొటోల్లో బంధించడం చెయ్యలేదు

అయినా అవన్నీ వివరంగా

మరచిపోలేని చిత్రాలుగా

మనసుల్లో మిగిలి పోయాయి

కెమరాలు, ఆల్బమ్ లలో  కాకుండా.

అవి ఎంత మధుర క్షణాలో

కాలం నడక తెలిసేది కాదు

వాచీ నాన్న చేతికి మాత్రమే ఉండేది.

Also read: లీలాకృష్ణ

Also read: వందనం

Also read: సజీవ శిల్పం

Also read: సంస్కృతం

Also read: మరక మంచిదే

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles