Tuesday, April 23, 2024

“ఉగాది శోభ”

నేను కవిత్వం రాయలేను

నాకు వసంతం కనుపించడం లేదు

కోయిల పాట వినిపించడం లేదు

దౌర్జన్యం ఢంకా మోగిస్తూ చెలరేగుతుంటే

కబ్జాలు నిత్యకృత్యాలవుతుంటే

మేధావుల గొంతులు మూగ పోతుంటే

ఆలోచనాపరులు అచేతనులవుతుంటే

రక్షకులే రాకాసులుగా మారి

అన్యాయాన్ని ఆదాయ మార్గం చేసుకుంటే

మదిర మత్తులో జనం ఊగుతుంటే

మాన మర్యాదలు మంట గలిపే

నిందలు, అవమానాలు సంభాషణలైతే

మావి చిగుళ్లు, ఉగాదులు మనసుని అలరించకుంటే

మదిలో మెదిలే భావనలు అరణ్య రోదనలవుతుంటే

సామాన్యుడు బిక్కుబిక్కుమని బతుకుతుంటే

నేను ఉగాది కవిత్వం ఎలా రాయను?

కవులు గతాన్ని, కలల్ని వదలి

వర్తమానంలోని సత్యాన్ని ఎలుగెత్తి చాటినపుడు

శోభకృత నామ సంవత్సరం

బతుకును శోభాయమానం చేసినపుడు

ఆనంద తాండవం చేస్తాను

ఆనాడే నవ యుగాది కవితను రాస్తాను.

Also read: “స్త్రీ”

Also read: “కామ దహనం”

Also read: “కర్తవ్యం”

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles