Thursday, March 28, 2024

అర్పణం

కాసారంలో కనువిప్పిన కలువవు నీవు

బురదగుంటలో బుడగతామర నేను 

సకల జనుల లక్ష్యానివి నువ్వు

జన జడత్వాన్ని భరించలేని బడుగు కవిని నేను.

కలంనుండి జాలువారిందేదీ 

ఎంగిలికూడు కాకూడదన్న తపన నాది

కవితా కన్యల అందాలు ఆరబోసిన కవుల ముందు

సిగ్గు మొగ్గలవుతూ మేలి ముసుగులో నువ్వు 

నాకు సర్వ సమర్పణకు సిద్ధంగా.

Also read: చవటాయ్

Also read: బాగుపడాలంటే

Also read: గమ్యం

Also read: ఆకలి కేక

Also read: అరుణం

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles