Thursday, March 28, 2024

గాడిదను హింసించినందుకు ఎన్ఎస్ యూఐ నేత బల్మూర్ వెంకట్ పై కేసు

గాడిదను దొంగిలించి.. మూగ జీవిని హింసిస్తూ..సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గాడిద మొహానికి సీఎం కేసీఆర్ ఫోటోను పెట్టి అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన లో ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్  వెంకట్ పై కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు కరీంనగర్ అదనపు డిసిపి లా అండ్ ఆర్డర్ శ్రీనివాస్ తెలిపారు. సతీష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శుక్రవారం పోలీసు కమిషనరేట్ కాన్ఫరెన్స్ హల్లో మీడియా సమావేశంలో అదనపు డీసీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పద్దతిలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందనీ, కానీ ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీయకుండా..ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా ఉండాలనీ..సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా చేపల వ్యాన్ లో గాడిదను తీసుకొచ్చి, గాడిద మొహానికి సీఎం కేసీఆర్ ఫోటో పెట్టి మూగజీవి తో అమానుషంగా ప్రవర్తించడం పై ఐటి..జంతు హింస కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ విజ్ఞాన్ రావు, ఎస్సై ఎల్లయ్య గౌడ్ ఉన్నారు.

వెంకట్ అరెస్టు దుర్మార్గం: రేవంత్ రెడ్డి.

‘‘నిరుద్యోగ సమస్య పై ఒక విద్యార్థి నాయకుడుగా బల్మూరు వెంకట్ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయడం రాజ్యాంగ హక్కు. హక్కులను కాలరాస్తూ పోలీసులు కాంగ్రెస్ నాయకుల పట్ల దొర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థి నాయకుల పట్ల పోలీసుల వ్యవహారం చట్ట విరుద్ధంగా ఉంది.కాంగ్రెస్ నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలి. లేకపోతే ప్రజా పోరాటం మరింత విస్తరించి ప్రభుత్వ మెడలు వంచుతాం,’’ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles