Tuesday, September 26, 2023

ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం: ఆరుగురి దుర్మ‌ర‌ణం

హైద‌రాబాద్‌: ‌నెహ్రూ అవుట‌ర్ రింగ్ రోడ్డు మంగ‌ళ‌వారం తెల్ల‌వారుఝామునే ర‌క్త‌సిక్త‌మైంది. రెండు వాహ‌నాలు ఢీకొని, ఆరుగురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటి గ్రామం వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఈ ప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వాహనం ముందున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన కొందరు బొలేరో వాహనంలో హైదరాబాద్‌ నుంచి పటాన్‌చెరు వైపు ఔటర్ రింగ్ రోడ్డులో ప్ర‌యాణిస్తుండ‌గా అదే రోడ్డుపై వెనక నుంచి అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.  వారంతా సంఘ‌ట‌న స్థ‌లంలోనే క‌న్నుమూశారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు.  మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles