Friday, April 19, 2024

మరో రాష్ట్రానికి ఇలాంటి అన్యాయం జరగకుండా చూడండి: ఉండవల్లి

వోలేటి దివాకర్

  • ఉండవల్లి పిటిషన్ పై వచ్చేవారం నుంచి  సుప్రీం కోర్టు లో విచారణ
  • మరో రాష్ట్రానికి ఇలాంటి అన్యాయం జరగకుండా చూడండి!

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. రాష్ట్రాల విభజన వ్యవహారంలో నియమ నిబంధనలపై ఉండవల్లి గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.

ఏపీ పునర్విభజన సమయంలో తప్పులు జరిగాయని.. విభజన ప్రక్రియ సరిగా జరగలేదంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినందున భవిష్యత్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని ఉండవల్లి సవరణ పిటిషన్‌ వేశారు.

ఈ అంశాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం ముందు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ప్రస్తావించారు. పిటిషన్‌ దాఖలు చేసి చాలా కాలం అయిందని ఆయన గుర్తుచేశారు. ప్రశాంత్‌భూషణ్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ.. దీనిపై త్వరితగతిన విచారణకు జరిపేందుకు అంగీకారం తెలిపారు. వచ్చేవారం లిస్ట్ లో ఈ పిటిషన్‌ను పొందుపరిచేలా చూడాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles