Wednesday, April 24, 2024

సంచైత నియామకం చట్టరీత్యా వ్యతిరేకం

  • అశోక్ గజపతిరాజు ధ్వజం

విజయనగరం: తూర్పు గోదావరి దేవాలయాలకు అధ్యక్షురాలిగా సంచైత గజపతిని నియమించడం చట్టరీత్యా వ్యతిరేకమని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా బోర్డు నియమించటం సరికాదన్నారు. మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలోని తూర్పు గోదావరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఛైర్మన్​గా కొనసాగుతున్న తనని తొలగించి, సంచైత గజపతిని నియమించటంపై మాజీ కేంద్రమంత్రి అశోక్​ గజపతి రాజు స్పందించారు. ఇదంతా రాజకీయ కక్షతో చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని దేవాలయాలపై కన్ను పడిందని దుయ్యబట్టారు. అన్ని మతాలను ప్రభుత్వం గౌరవించాలని, ఒక్కో మతాన్ని ఒక్కో విధంగా చూడటం శుభం కాదన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles