Friday, April 19, 2024

వేలాల మల్లిఖార్జున స్వామికి రామగుండం సీపీ ప్రత్యేక పూజలు

  • భక్తుల రాకతో కిటకిటలాడిన ఆలయాలు

రామగుండం పోలీస్ కమీషనర్  వి.సత్యనారాయణ మహాశివరాత్రి పర్వదిన సందర్బంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల మల్లిఖార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

వాహనాల రద్దీ పెరిగితే ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి గోదావరిలో స్నానాలు ఆచరించారు. మంచిర్యాల, కుమరంభీం, అసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తుల రాకతో శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడాయి.

Also Read: కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న రామగుండం పోలీస్ కమిషనర్

ఈ కార్యక్రమం లో ఏసీపీ జైపూర్ నరేందర్, సీఐ శ్రీరాంపూర్ కోటేశ్వర్, సీఐ చెన్నూర్ రూరల్ నాగరాజు, ఆర్ఐ శ్రీధర్,ఎస్ ఐ జైపూర్ రామకృష్ణ ఆర్ ఎస్ఐ సంతోష్ పాల్గొన్నారు.

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles