Friday, September 29, 2023

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న రకుల్ , నబా నటేష్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సెలబ్రటీలు ఒకరి కొకరు పోటీ పడుతూ మొక్కలు నాటుతున్నారు. తమ స్నేహితులను మొక్కలు నాటాలని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్కినేని నాగ చైతన్య విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని బెంగళూరు లోని తన నివాసంలో మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టి ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి రకుల్, నబా నటేష్ లు కృతజ్ఞతలు తెలిపారు.

Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles