Tuesday, April 16, 2024

ఆల్-ఇంగ్లండ్ లో సింధుకు సెమీస్ షాక్

* ఆవిరైన సింధు టైటిల్ ఆశలు
* థాయ్ ప్లేయర్ చేతిలో పరాజయం

ప్రతిష్టాత్మక ఆల్-ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గాలన్న భారత స్టార్ పీవీ సింధు ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. కరోనా కారణంగా ప్రపంచ మేటి ప్లేయర్లంతా దూరంగా ఉన్న ఈ టోర్నీలో విజేతగా నిలిచే సువర్ణ అవకాశాన్ని సింధు సద్వినియోగం చేసుకోలేకపోయింది.

క్వార్టర్ ఫైనల్లో జపాన్ ప్లేయర్ యమగుచిని మూడుగేమ్ ల సమరంలో అధిగమించిన సింధు…సెమీస్ పోరులో మాత్రం 6వ సీడ్ థాయ్ ప్లేయర్ పోర్న్ పావీ చోచువాంగ్ చేతిలో వరుసగేమ్ లతో పరాజయం పాలయ్యింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన ఈ పోరులో… ఫైనల్లో చోటు కోసం ఢీకొన్న సింధు 17-21, 9-21తో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్ర్రమించింది.

Also Read : ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సెమీస్ లో సింధు

1980 లో ప్రకాశ్ పడుకోన్, 2000లో పుల్లెల గోపీచంద్ తర్వాత ఆల్ ఇంగ్లండ్ టైటిల్ నెగ్గిన భారత షట్లర్లు లేకపోడం విశేషం. ఆలోటును పూడ్చాలన్న సింధు ప్రయత్నం చివరకు 2021 టోర్నీలో సైతం నెరవేరలేదు. పురుషుల సింగిల్స్ లో కిడాంబీ శ్రీకాంత్, లక్ష్యసేన్,ప్రణవ్ సైతం విఫలమయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles