Thursday, April 25, 2024

కోదండరాం పట్ల పోలీస్ జులుం, కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

  • టీజేఎస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి ధర్మఅర్జున్ ,బైరి రమేష్ డిమాండ్

 హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా  అఖిల పక్షాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ సందర్భంగా హైదరాబాద్ లో పాల్గొన్న  ఆచార్య కోదండరాంను  పోలీసులు ఉద్దేశ్య పూర్వకంగా టార్గెట్ చేసి అవమానించారని తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున్, బైరి రమేష్ ఆరోపించారు.

ప్రొఫెసర్ కోదండరాం ను అరెస్టు చేసిన సందర్భంగా  పోలీస్ లు ఓవరాక్షన్ చేశారనీ, కోదండరామ్ పై పోలీస్ లు బల ప్రయోగం చేశారనీ, ఒంటి మీద బట్టలు చించివేసి దారుణంగా వ్యవహరించారనీ చెబుతూ ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రొఫెసర్ కోదండరాం ప్యాంట్ చినిగిపోయింది. అట్లాగే ఆయన కూర్చోవడం ఫొటోలో చూడవచ్చు.

తెలంగాణ రాష్ట్రం లో ప్రజలను ఐక్యం చేసే ప్రతి  సందర్భంలో కేసీఆర్  ప్రభుత్వం కోదండరాం సార్ పై పోలీసులతో దాడి చేయిస్తున్నదనీ,  సీమాంధ్ర పాలకులు కూడా పాల్పడని దాష్టీకానికి కేసీఆర్ ప్రభుత్వం ఒడిగట్టుతున్నదనీ, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరాం పట్ల ఈ విధంగా అనుచితంగా ప్రవర్తించడం క్షమార్హంకాని నేరమనీ వారు అన్నారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles