Thursday, March 28, 2024

కవిత్వం

లలిత కళలు మనిషిలో సున్నితత్వాన్ని తద్వారా మంచిని పెంచుతాయి. అందులో కవిత్వానిది అగ్ర తాంబూలం. మనసులో కలిగే భావనల ప్రతిరూపమే కవిత్వం. జంట పక్షుల్లో ఒకటి వేటగాడి బాణానికి  గురై చనిపోయినపుడు ఓ కిరాతకుడు మహాకవిగా, మహర్షిగా మారాడు. ఆనాటి స్పందనే రామాయణ కావ్యం.

ఒకప్పుడు సంస్కృత పదాలతో, చందస్సు, యతి, ప్రాసలతో నిండిన కవిత్వం నేడు బంధాలు తెంపుకుని భావ, విప్లవ, ఆధునిక కవిత్వాలుగా ధ్వని, రమణీయత కోసం ప్రతీకలు, భావ చిత్రాలు ఉపయోగించుకుంటూ సామాన్యుడి భాషలో రసరమ్య సౌరభాలు వెదజల్లూతూ సాగుతూంది. సద్విమర్శ తోడైతే మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుంది.

Also read: ద్వైతం

Also read: అహం-కారం

Also read: విభ-జనం

Also read: ఆ-కలి

Also read: మన రాజ్యం

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles