Friday, April 19, 2024

ఫ్లెమింగో-12

ముక్కున కరచి తెచ్చిన బేడిసని

మూరపెంగా ముద్దరాలి కందిస్తుంది ఫ్లెమింగో

తిర్రె తిఱికిణి సాధించిన వేళ

ప్రియురాలి నెంతగా కలవరిస్తోందో

వంజరం ముక్కు పంజరాన

పరవశించి రెక్కలెగదన్ని పిల్లల్ని కలగంటుంది

ఎవరు నేర్పాలో ఇన్ని రాగాలీ పక్షలకి

ఎలా అమరిందో ఇంత ప్రేమ వలయాక్షులకి

ఏ మొదటి పక్షి జాడ జూపిందో ఈ ప్రాంతానికి

ప్రతి యేడాది తప్పని సంసార తిరనాల

నేల పట్టు ముంగిట్లో అనురాగాల ప్రాణహేల

బుడత పక్షులకు రెక్కలొస్తాయి

పిల్ల చేపలు తిండి గింజలౌతాయి

పులికాటే నీటి పంటకాసే పొలం

రొయ్యపిల్లే నోటికందించిన ఫలం

బుల్లి ఫ్లెమింగో రెక్కలాడిస్తూ పాము చేపను వేటాడుతుంది..

ముక్కు వంకర లకుముకి పిట్ట

మట్టగిడసను వెంటాడుతుంది

గిరస చేపల వరసని విచ్చిన్నం చేసి

పరజ పిల్లకాకి ఆనందిస్తుంది

రెక్కలొచ్చిన  పిల్లపక్షులకి

ఆకాశం ఎంతో ఇరుకు

ఎగరటం నేర్చిన ఎర్రతీతువు పిట్టకి

నీలి సరస్సు చేపలగాదె

ఆహారాన్వేషణా సమరంలొ

భరత పిట్ట తాండవం

ఆకలికేకల రావడిలో

పిగిలిపిట్ట ఉపజీవిక

ఆకలి పురాతన శత్రువు ఏ ప్రాణికైనా

క్షుదారి సంహారమే శాంతి ఏ జీవికైనా

దేవతలే అమృతం సేవిస్తారు ఆకలైతే

చిన్నచేపనే పెద్దచేప మింగేస్తుంటే

పక్షికోటి

తప్పేంటి చేపల్ని తింటే..!!

Also read: ఫ్లెమింగో-12

Also read: ఫ్లెమింగో-11

Also read: ఫ్లెమింగో-10

Also read: ఫ్లెమింగో-9

Also read: ఫ్లెమింగో-8

Perugu Ramakrishna
Perugu Ramakrishna
కవి పరిచయం..! 1975 లో 10 వ తరగతిలోనే తొలికవిత రాసి కవిత్వ యాత్ర మొదలెట్టిన కవి. కవిత్వమే ఊపిరిగా జాతీయ , అంతర్జాతీయ కవిగా ఎదిగిన సుపరిచితులు. వెన్నెల జలపాతం(1996) , ఫ్లెమింగో (దీర్ఘ కవిత2006), నువ్వెళ్ళిపోయాక (దీర్ఘకవిత2003), ముంజలు (మినీకవితలు2007) పూలమ్మిన ఊరు (2012) ఒకపరిమళభరిత కాంతి దీపం(2017), దూదిపింజల వాన (2020) మరియు మొత్తం 26 ప్రచురితాలు ..అంతేగాక సుమారు 200 అంతర్జాతీయ సంకలనాల్లో తన ఆంగ్ల అనువాద కవితలు నమోదు చేసుకున్న అరుదైన భారతీయ తెలుగు ప్రాంత కవి. 15 దేశాలు కవిత్వం కోసం పర్యటించి పలు విశ్వ వేదికలపై తెలుగు కవితా వాణి బలంగా వినిపించిన విశేష కవి. రంజని -కుందుర్తి ప్రధాన అవార్డ్ , ఎక్స్ రే ప్రధాన అవార్డ్ లతో మొదలెట్టి సుమారు 100 విశిష్ట అవార్డ్ లు ,2008 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి డా వై యస్సార్ ద్వారా రాష్ట్ర ఉగాది విశిష్ట పురస్కారం, గ్రీస్ , జపాన్, మలేషియా, కెనడా, అమెరికా, చెక్ రిపబ్లిక్ , ఘనా, సింగపూర్, లాంటి ఎన్నో దేశాల పురస్కారాలు , తాజాగా 2019 భారత స్వాతంత్ర్య దినం సందర్భంగా గుజరాత్ సాహిత్య అకాడెమీ పురస్కారం ..లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక గౌరవాలు పొందారు. చెక్ రిపబ్లిక్ (2016) మెక్సికో (2019) లనుండి రెండు గౌరవ డి లిట్ లు అందుకున్నారు. వీరి రెండు కవితా సంపుటుల మీద రెండు విశ్వ విద్యాలయాలు ఎం.ఫిల్ డిగ్రీలు ప్రదానం చేయగా , మద్రాసు విశ్వ విద్యాలయంలో మొత్తం కవిత్వ గ్రంధాల పై పి హెచ్ డి పరిశోధన జరుగుతుంది. వీరి కవిత్వం పలు భారతీయ భాషల్లోకి స్పానిష్, ఫ్రెంచి, జపాన్, గ్రీస్, అల్బేనియా, రుమేనియా, అరబ్ లాంటి ప్రపంచ భాషల్లోకి అనువాదమై ప్రచురణ పొందింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles